ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి రాగానే తీసుకున్న చర్యలతో దేశప్రజలందరూ ఔరా అనుకున్నారు. అర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని ఆయన ప్రభుత్వం సురక్షిత తీరాలకు చేర్చుతుందని భావించారు. ఇందుకు ప్రధాని మోదీ తీసుకున్న పోదపు చర్యలే దేశ ప్రజలను విస్మయానికి కూడా గురిచేశారు. అయితే రానురాను ఆయన మంత్రిమండలిలోని మంత్రులు మాత్రం విమర్శకులకు అనేక అస్త్రాలను సంధించేందుకు అవకాశం ఇచ్చారు. సీనియర్ మంత్రులను మినహాయిస్తే.. జూనియర్ మంత్రులు, కోత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు.
తమ తమ కార్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని సీనియర్ క్యాబినెట్ మంత్రులు.. తమ జూనియర్లను మాత్రం తమ బాటలో నడిపించలేకపోయారు. సీనియర్ మంత్రుల సహాయ మంత్రులు మాత్రం భారీగానే ఖర్చు పెట్టి తమ ఆఫీసులకు కొత్త హంగులను సమకూర్చుకున్నారు. ఈ జాబితాలోనూ కేంద్రమంత్రి.. వివాదాలకు కేంద్రబిందువుగా పేరొందని స్మృతి ఇరానీ టాప్ ప్లేస్ సంపాదించారు. ఓ ఆర్టీఐ కార్యకర్త రాబట్టిన వివరాల మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లు ఆఫీసుల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
ఇక మోదీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు 23 మంత్రుల కార్యాలయాల్లో వసతుల కల్పనకు రూ. 3.5 కోట్లను ఖర్చు చేశారు. వీరిలో స్మృతీ ఇరానీ అత్యధికంగా రూ. 70 లక్షలను, జూనియర్ మంత్రుల ఆఫీసుల కోసం మరో రూ. 40 లక్షలను వెచ్చించారని తెలుస్తోంది. నజ్మా హెప్తుల్లా ఖర్చు చేయనప్పటికీ, ఆమె నిర్వహిస్తున్న మైనారిటీ శాఖకు సహాయమంత్రిగా ఉన్న ఎంఏ నఖ్వీ రూ. 14 లక్షలతో ఆఫీసును తీర్చిదిద్దుకున్నారు. ఇక తాము కాలుమోపిన వేళ, చెత్తగా ఉన్న ఆఫీసులను సరిగ్గా చేసుకున్నామని వీరంతా చెబుతుండటం గమనార్హం. అత్యధికంగా ఖర్చు పెట్టిన వారిలో వీరేందర్ సింగ్, రాజ్యవర్థన్ రాథోడ్, ఉపేంద్ర కుష్వాహ, ఆర్ఎస్ కథేరియా, జేపీ నడ్డా, జితేందర్ సింగ్ తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more