కాపుల ఓట్లతో అందలం ఎక్కి.. వారిని ఎన్నికల ముందు అనేక హామీలను గుప్పించి.. ఒక్క దానిని కూడా నిజాయితీగా నెరవేర్చకపోవడంతో.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సభకు తాము మద్దతు ఇవ్వడం వల్లే తమపై అనవసర కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అరోపించారు. తమను ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని కాపులకు మద్దతు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని ఆయన పునరుద్ఘాటించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చారు.
సిబిఐ మళ్లీ తనను రేపు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పిందని, దీంతో తాను రేపు కూడా విచారణకు హాజరవుతానని చెప్పారు. తనను ఎంత భయపెట్టినా.. బెదిరేది లేదని, తనకు సంబంధం లేని కేసులో తనను విచారణకు పిలవడం దారుణమన్నారు, తుని విధ్వంసం ఘటనలో తనకు నోటీసులు ఇచ్చి సీఐడీ విచారణకు పిలిపించడం చంద్రబాబు చేస్తున్న దాష్టీకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ఏ ఉద్యమమూ ఉక్కుపాదాలతో అణిగిపోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబే ఎన్నికల మేనిఫెస్టోలో కాపులు బీదరికంతో బాధపడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే వాళ్ల జీవితాలను కాంతివంతం చేస్తానని, వాళ్లందరినీ బీసీలుగా మారుస్తానని ప్రకటించారని భూమన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన అసలు నైజాన్ని బయటపెట్టారని, దీంతో కాపు కులస్థులు అయన తిరగబడుతున్నారని అరోపించారు, కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మారుతున్నాయని మండిపడ్డారు, చంద్రబాబుకు కాపులకు మధ్య సంబంధం పాము- కప్పలాంటిదని ఆయన ఎద్దేవా చేశారు.
కాపుల విషయంలో చంద్రబాబు రూథర్ ఫర్డ్ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తుని ఘటనతో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. కేవలం ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చినందుకు తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి దాని వెనక మా పార్టీ కుట్ర ఉందని మొదటి రోజు నుంచే సీఎం, హోం మంత్రి అంటున్నారని ఆయన గుర్తుచేశారు. అయితే పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేస్తారన్న నమ్మకం ఉందని.. అందుకే వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. ఫోన్ కాల్ లిస్టులో తన పేరుందని అడిగిన ప్రశ్నకు కేవలం చంద్రబాబు లిస్టులో వున్నందుకే తనను టార్గెట్ చేశారని అరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more