వేలకోట్ల ప్రజల సోమ్మును రుణాలుగా పోంది.. ఉద్దేశపూర్వకంగా వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు, లిక్కర్ కింగ్ యూబీఎల్ ఛైర్మన్ విజయ్ మాల్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. మాల్యా రుణంగా పోందిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా కోరుతూ బ్యాంకుల కన్సార్టియం సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ డిఫాల్ట్ కేసులో విజయ్ మాల్యాపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420 ప్రకారం సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో మాల్యా దోషిగా నిర్ధారణ అయితే సుమారు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతోపాటు వివిధ నేరాల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) సహా వివిధ సంస్థలు మాల్యాపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ కూడా మాల్యాకు ఝలకిచ్చింది. మాల్యా పేరును స్పష్టంగా పేర్కొనని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రూ.1.64 కోట్ల రూపాయల చెల్లింపులను నిలిపివేసినట్టు తెలిపింది.
టీడీఎస్ శాఖ ఆదేశాల కనుగుణంగా చెల్లింపులను నిలిపి వేసినట్టు పేర్కొంది. మాల్యాపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసు విచారణ నడుస్తున్న కారణంగా రూ.1.64 కోట్ల రూపాయల చెల్లింపును నిలిపివేసినట్టు చెప్పింది. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ కమిషనర్ నుంచి తమకు లేఖ అందిందని కంపెనీ తెలిపింది. జీతం, వేతనం, భత్యాలు తదితర చెల్లింపులను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డర్ జూన్ 28, 2016 న తమకు అందిందని కంపెనీ తెలిపింది. అయితే దీనిపై స్పందించడానికి కంపెనీ ప్రతినిధి తిరస్కరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more