పంజాబ్కు చెందిన ఆప్ ఎంపీ భగవంత్ మాన్సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ భద్రతకు సంబంధించి ఆయన షూట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి.
పార్టీలకతీతంగా ఎంపీలంతా ఆయనపై విరుచుకుపడుతున్నారు. భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్ బాదల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తప్పనిసరిగా దర్యాప్తు జరిపించాలని, పార్లమెంట్ కార్యకలాపాలను వీడియో తీయడం వెనుకున్న ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి స్టింగ్ ఆపరేషన్ దారుణమని... ప్రజాసామ్యానికి టెంపుల్ లాంటి పార్లమెంట్ భద్రతపై స్టింగ్ ఆపరేషన్ చేయడమేంటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య, జాతి భద్రత దృష్ట్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, ఆ పని మళ్లీ మళ్లీ చేస్తానంటున్నారని నిర్మలాసీతారామన్ అన్నారు.
పార్లమెంట్ భద్రత వ్యవహారాన్ని వీడియోలు తీయడం దారుణమని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఇది భద్రత నియమాలను ఉల్లంఘించడమే కాదు, సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న ఆయన అసలు ఎందుకు ఆలస్యం జరుగుతుందని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు కూడా కేంద్రం ఆధీనంలోనే ఉంటారు కదా అని సీతారాం ఏచూరి అన్నారు.
మరోవైపు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎదుట హాజరై భగవంత్ వివరణ ఇచ్చారు. జీవో అవర్ లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చూపించేందుకే వీడియో తీశానని భగవంత్ చెప్పారు. అంతేకాని పార్లమెంటులో భద్రతపై తాను వీడియోను షూట్ చేయలేదని చెప్పుకోచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చలు లక్కీ డ్రా మాదిరిగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భద్రతకు భంగం కలిగించలేదన్నారు. జీవో అవర్ లో చేసిన వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం పార్లమెంటులో పెద్ద దుమారాన్నే లేపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more