భారత సైనికులకు అధునాతన ఆయుధాలను అందించేందుకు కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎంతో అవసరమైన శతృఘ్న తుపాకులను కూడా కొనుక్కోలేని నిస్సహాయ స్థితిలోకి చేరిన దేశ రక్షణ శాఖలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పగ్గాలను చేపట్టిన తరువాత మార్పులు తీసుకువచ్చారు. రక్షణ శాఖకు చెందిన ఆయుధాల కొనుగోలు తదితర అంశాలలో కుంభకోణాల ఆరోపణలకు భయపడి కూర్చుంటే లాభం లేదని తాను దేనికీ భయపడకుండా నిర్ణయాలు తీసుకుంటానని మనోహర్ పారికర్ అప్పటిలో ప్రకటించారు. ప్రకటనకు అనుగుణంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తదితర వస్తువుల కొనుగోలుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ముందుగా ఆయన చర్యలు తీసుకున్నారు.
1986 లో బోఫోర్స కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి ఆ సాంకేతికతను వినియోగించి రూపోందించాల్సిన శతృఘ్ని తుపాలను గత మూడు దశాబ్దాలుగా వాయిదా వేసిన రక్షణ శాఖకు ఎట్టకేలకు నిజాయితీ నేతగా పేరొందిన ఏకే అంటోని రక్షణశాఖ బాద్యతలను నిర్వహించిన సమయంలో 155 ఎంఎం హౌటిజర్స్ తయారుకు దేశీయంగా చర్యలు తీసుకోవాలని భారత్ రక్షణ పరిశోధక శాఖలను అదేశించడంతో 2012 నుంచి వీటి రూపకల్పనకు ఢిపెన్స్ ఫ్యాక్టరీలు అధ్యయనం చేశారు.
బోఫోర్స్ తొలి డీల్ లో లభించిన సాంకేతిక పరిజ్ఞానానికి దేశీయ పరిజ్ఞానాన్ని జోడించి మరింత అదునాతనంగా శతృఘ్ని తుపాకులను రూపోందించాలని అంటోని అదేశాల మేరకు భారత అర్డినెన్స్ పరిశోధనా విభాదాలు బోఫోర్స్ కన్నా అధునాతనం, శక్తివంతమైన శతృఘ్ని తుపాలను తయారు చేసి వాటికి ధనుష్ లుగా నామకరణం చేశారు. కొత్తగా ఒక్క 155 ఎంఎం శతఘ్ని తుపాకీలు రూపోందించి.. భారత సైన్యానికి అందించింది. ఈ మేరకు అర్డినెన్స్ ఫ్యాక్టరీ గన్ క్యార్యేజ్ ఫ్యాక్టరీ జాయింట్ జనరల్ మేనేజర్, పీఆర్వో సంజయ్ శ్రీవాత్సవ తెలిపారు.
భారత్ ఆర్మీకి మరో మూడు ధనుష్ శతృఘ్ని తుపాకులను కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. ఇది 155ఎంఎం/ 45 కాలిబర్ హోవిట్జర్ శతఘ్ని తుపాకి. అత్యంత శక్తిమంతమైన అధునాతనమైన ఈ శతఘ్ని తుపాకి 83 శాతం భారతీయ విడిభాగాలతో తయారు చేసిన ఘనత మన ఆర్డినెన్స ఫ్యాక్టరీ సొంతం చేసుకున్నది. కొల్ కత్తాలోని అర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో రూపాందించిన ఈ తుపాలకు మొత్తంగా 114 కావాలని భారత అర్మీ అర్డర్ చేసిందని, వాటితో తొలి విడతగా మూడు తుపాకులను అందించామని మరో మూడింటిని త్వరలోనే అంతజేస్తామని శ్రీవాత్సవ తెలిపారు.
ఒక్కోటి దాదాపు 14 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ ధనుష్ శతఘ్ని తుపాకీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేటితరం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో పోటీ పడేదిగా ఉంది. ఎలక్ట్రానిక్ విధానంలో తుపాకీని అమర్చడం, శత్రు వ్యవస్థలను గుర్తించే పరికరాలతో పాటు ఇతర పలు అత్యాధునిక వ్యవస్థలుండే, దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ తుపాకీ బోఫోర్స నుంచి 30 ఏళ్ల కిందట దిగుమతి చేసుకున్న హోవిట్జర్ తుపాకీ కన్నా అదనంగా 11 కిలోమీటర్ల దూరం రేంజిని కలిగి ఉంటుంది. భారత సైన్యం వీటిని ఇప్పటికే వేసవి కాలపు పరీక్షలు, వర్షాకాలపు, శీతకాలపు పరీక్షలు నిర్వహించగా, వాటిని ధనుష్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ పరీక్షలలో సుమారు 2000 రౌండ్లను భారత అర్మీ పరీక్షించింది. మంచు, ఏడారి, సాధారణ పరిస్థుల ప్రభావం అధికంగా వుండే ప్రాంతాలలో ఈ పరీక్షలను నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more