పన్ను ఎగవేత అభియోగాలతో ఇండియా బుల్స్ కు చెందిన కంపెనీల కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు జరిపింది. క్రితం రోజున ప్రారంభమైన దాడులు ఇవాళ కూడా కోనసాగాయి. ఉన్నట్టండి సునామి వచ్చినట్లుగా ఇండియ బుల్స్ కంపెనీపై భారీ స్థాయిలో దాడులు జరగడం ఎందుకన్న అనుమానాలు కూడా కార్పోరేట్ ప్రపంచంలో చక్కర్లు కోడుతున్నాయి. అయితే వివిధ లావాదేవీలకు సంబంధించి దాదాపు రూ.1,500 కోట్ల పన్ను ఎగవేత జరిగిందన్న పక్కా సమాచారంతోనే అదాయపన్ను శాఖ దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యాలయాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించిందన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. పోలీసు రక్షణతో దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది ఐటి శాఖ ఉద్యోగులు ఈ సోదాల్లో పాల్గొన్నారు
గ్రూపు కంపెనీల విభజన తర్వాత ప్రమోటర్లకు ఆస్తులు బదిలీ చేసే క్రమంలో పన్నులు ఎగవేసేందుకు అనేక అవకతవకలకు పాల్పడినట్టు ఐటి శాఖ అనుమానించి దాడులు నిర్వహించింది. దీనికి తోడు గ్రూపు కంపెనీలు ఇటీవల సేకరించిన రూ.1,700 కోట్ల రుణాలపైనే ఐటి అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. గతంలో కంపెనీ ఆస్తులు అమ్మినపుడు దాదాపు రూ.1,000 కోట్ల విలువైన బినామీ లావాదేవీలు జరిగినట్టు ఐటి అధికారులు అనుమానిస్తున్నా రు. కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై, చెన్నై ఆఫీసుల నుంచి అనేక కీలక డాక్యుమెంట్లతో పాటు కొన్ని కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
కాగా ఇటీవలి కాలంలో ఒక కార్పోరేట్ సంస్థకు చెందిన కార్యాలయాలపై ఇంత పెద్ద ఎత్తున సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఆఫీసుల్లో ఐటి శాఖ సోదాలు చేయడం నిజమేనని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ బిఎ్సఇకి తెలియజేసింది. ఈ దాడుల్లో అదాయపన్ను శాఖ అధికారులకు తమ సంస్థ సభ్యులు అన్ని వివరాలను అందించి సహకరించారని సంస్థ తెలిపింది. కాగా అదాయపన్ను శాఖ దాడుల నేపథ్యంలో ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇండియాబుల్స్ వెంచర్స్ లిమిటెడ్, ఇండియాబుల్స్ హోల్సేల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీల షేర్లు నష్టపోయాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more