నగరంలోని బేగంపేట్ లో గల లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూధన్ రెడ్డి నివాసంలో పూజలు జరిపి రైస్ పుల్లింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటనను హైదరాబాద్ వాసులతో పాటు యావత్ తెలుగు ప్రజలను అప్రమత్తం చేసినా.. మరోమారు అలాంటి తరహాలోనే మోసం జరిగింది. ఈ సారి ఏకంగా రంగంలోకి దిగిన మహిళలు మాయమాటలు చెప్పి మరీ మోసానికి పాల్పడ్డారు. మీ పాపకు దిష్టి తగిలింది, పూజలు చేసి దిష్టి తీస్తాం*.. అని మాయమాటలు చెప్పి ఇద్దరు మాయ్ఙలేడీ*లు రూ. 76 వేలతో ఉడాయించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉండే వ్యాపారి శివరామిరెడ్డి (60) ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వచ్చారు. తాము దగ్గరలో ఉండే గుడిలో పూజలు చేస్తామని, బోనాల పండుగ సందర్భంగా ప్రసాదం చేసేందుకు బియ్యం, బెల్లం కావాలని అడిగారు. మీకు శుభం జరుగుతుందని శివరామిరెడ్డి భార్యకు బొట్టు పెట్టారు. ఆమె బియ్యం తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా వారు కూడా ఆమె వెనుకే వెళ్లారు. ఁ్ఙమీ పాపకు ఆరోగ్యం బాగలేదు.. దిష్టితీయాలి. పూజ చేసి దిష్టి తీస్తే శుభం జరుగుతుంది. ఇంట్లో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు పూజలో పెట్టండి** అన్నారు. దీంతో ఆమె అమ్మాయి ఫీజు చెల్లించేందుకు తెచ్చిన రూ. 76 వేలు వారి బుట్టలో పెట్టింది.
వారు డ బ్బును వస్త్రంలో మూట కట్టి.. బుట్టలో పెట్టి పూజ చేసినట్టు నటించారు. తర్వాత ఆ మూటలను ఆమెకు ఇచ్చి కబోర్డులో పెట్టి.. తాము వెళ్లాక తెరవమని చెప్పారు. అపార్ట్మెంట్ కింది వరకు పసుపు నీళ్లు చల్లాలని శివరామిరెడ్డి భార్యను కూడా తమ వెంట తీసుకెళ్లారు. తర్వాత ఆమె వచ్చి మూటను విప్పగా డబ్బులు లేవు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటికి వచ్చిన ఇద్దరు మహిళల్లో ఒకరు పెద్ద బొట్టు పెట్టుకొని, పట్టుచీర కట్టుకొని ఉందని, వయసు సుమారు 45 ఏళ్లు ఉంటాయని, మరో మహిళకు 30 ఏళ్లు ఉంటాయని, తెలుగు బాగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలకు చిక్కిన ఆ అగంతుకురాళ్ల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more