బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ పై విమర్శలకు మరింత పెదును పెడుతున్నారు. ఆర్థిక నిపుణులు బీజేపి ఎంపీ సుబ్రమణ్య స్వామి వాదనలను ఖండిస్తున్నా ఆయన మాత్రం తన తీరును మార్చకోకుండా, ఆయన ఏకంగా ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ ను తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను నష్టాల బాట పట్టిస్తున్న రాజన్ వెంటనే తొలగించాలని స్వామి డిమాండ్ చేశారు.
ఆయన ప్రధానికి రాసిన లేఖలో రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాదని స్వామి వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వం రాజన్ కు జారీ చేసిన గ్రీన్ కార్డ్ ను పొడిగించడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే భారత ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. రాజన్ తీసుకున్న నిర్ణయాల మూలంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయని దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ తన దాడిని కొనసాగించారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ఆర్బీఐ గవర్నర్ పై బహిరంగంగానే పొగడ్తలు కురిపించారు. సంక్లిష్ట ఆర్థిక సమస్యలను పెర్ ఫెక్ట్ గా విశ్లేషించారని ఒక సమావేశంలో ప్రశంసించారు. అటు కేంద్ర బ్యాంకునకు, ప్రభుత్వానికి మధ్య గౌరవప్రదమైన సంబంధంగా నిలిచారనే ఖ్యాతిని రాజన్ దక్కించుకున్నారు. మరోవైపు స్వామి ఆరోపణలపై రాజన్ మౌనం వహించారు. అటు రెండవసారి ఆయనకు ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు అప్పటించడంపై నిర్వహించిన సర్వేలో రాజన్ పెర్ ఫెక్ట్ అంటూ నెటిజన్లు కితాబిచ్చారు. మరి కేంద్రంలోని మోడీ సర్కార్.. రాజన్ వైపు మొగ్గుచూసుతుందా..? లేక సుబ్రహ్మణ్య స్వామి సిఫార్పులకు ప్రాధాన్యమిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more