క్రికెటర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన స్పీడస్టర్ శ్రీశాంత్ తాను ప్రాతినిద్యం వహిస్తున్న పార్టీకి కేరళ అసెంబ్లీలో ఏకంగా 70 అసెంబ్లీ స్థానాలు గెలుపోందుతుందని ప్రకటించాడు. అందరూ యూడీఎఫ్, ఎల్డీఎప్ ల గురించే మాట్లాడుతున్నారని, మరి తన పార్టీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. బెట్టింగ్ అరోపణలో క్రికెటర్ గా కెరీర్ కు ఫుల్ స్టాప్ ఇచ్చిన శ్రీశాంత్.. అటు నటనా రంగంలో అసక్తితో పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అదే సమయంలో వచ్చిన కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపికి ఆయనే అశాకిరణంగా కనిపించాడు. అతడ్ని ముందు నిలిపి ఎన్నికలకు వెళ్లినా.. బీజేపి తగు సంఖ్యలో సీట్లు రావన్నది ఎగ్జిట్ పోల్స్ అంచనా. అయినా తమ పార్టీకి 70 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆయన అంటున్నారు. అంతేకాదు తాను చాలా ఆశావాదినని, కాబట్టి కేరళలో బీజేపీకి 70కిపైగా సీట్లు వస్తాయని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు.
కేరళలో ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ బోణీ కొట్టలేదు. ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే సీటుగానీ, ఒక్క ఎంపీ సీటుగానీ గెలువని కమలం పార్టీ ఈసారి శ్రీశాంత్పై భారీ ఆశలే పెట్టుకున్నది. ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఎర్నాకులంలోని పోలింగ్ బూత్లో ఓటువేసిన అనంతరం శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ 'నేను చాలా ఆశావాదిని. బీజేపీకి 70కిపైగా సీట్లు వస్తాయి' అని ధీమాగా చెప్పాడు. కానీ ఆశావాదంపై నీళ్లు చల్లుతూ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి సున్నా నుంచి నాలుగు సీట్లు వచ్చే అవకాశముందని తేలింది. దీంతో రుసరుసలాడుతున్న శ్రీశాంత్ అంతా అధికార యూడీఎఫ్, ప్రతిపక్ష ఎల్డీఎఫ్ గురించే మాట్లాడుతున్నారని, బీజేపీకి ఓటువేసిన వారి సంగతి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన అనుభవ రాహిత్యం వల్ల అలా మాట్లాడుతున్నారని, అంతే కానీ బీజేపికి కేరళలో అంత సీన్ లేదని కొందరు బీజేపి నాయకులే వెనుక పెదవులు కొరుక్కుంటున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more