తమ దేశాలకు సక్రమంగా కట్టాల్సిన పన్నును ఎగ్గోట్టి విదేశాలలో పెట్టుబడులు పెట్టి.. నల్లధనాన్ని మూటగట్టుకుంటున్న అక్రమ కుబేరులకు సంబంధించిన మరో జాబితా బహిర్గమైంది. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) తాజాగా 2 లక్షలకుపైగా ‘పనామా’ పత్రాలను సోమవారం రాత్రి ఆన్లైన్లో విడుదల చేసింది. ఏయే దేశానికి చెందిన వారు ఏయే వ్యాపారాల పేరుతో విదేశాలో అక్రమంగా డబ్బను తరలించారో ఈ డాక్యూమెంట్లలో పోందుపర్చివుంది. www.offshoreleaks.icij. org వెబ్సైట్లో ఇవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
3.6 లక్షల మంది వ్యక్తులు, కంపెనీల పేర్లు వీటిలో ఉన్నాయని ఐసీఐజే సభ్యులు తెలిపారు. పనామాకు చెందిన ప్రైవేట్ లా సంస్థ మొసాక్ ఫోన్సెకా సంస్థ నుంచి తీసుకున్న సమాచారం ఈ పత్రాల్లో ఉంది. కాగా ఇందులో సుమారుగా రెండు వేల మంది భారతీయులు వున్నారని, వాటి చిరునామాల ఆధారంగా వీరిని లెక్కించామని కూడా ఐసిఐజే సభ్యులు తెలిపారు. దేశానికి పన్ను ఎగవేసి.. పన్నురాయితీ కల్పించే విదేశాలకు ఆ డబ్బును తరలించి వ్యాపారాభివృద్ది చేసుకున్న వారి జాబితాలో ఎందరో ప్రముఖుల పేర్లు ఇప్పటికే బయటపడటంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని అనేక మంది నల్లకుబేరుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఇదిలావుండగా, పనామా పత్రాల్లో పేర్లున్న భారతీయులపై సీబీఐ విచారణ జరపాలని వచ్చిన ఒక పిటిషన్పై స్పందన ఏమిటో తెలపాలని సుప్రీం కోర్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన దరఖాస్తును విచారించిన కోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. పనామా పత్రాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న 500 భారతీయ సంస్థల రహస్యాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో ఒక మల్టీ ఏజెన్సీ గ్రూప్ ఇప్పటికే ఏర్పాటు చేసింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more