బీహార్ లో గూండారాజ్ పాలనకు చెల్లుచీటి ఇచ్చేసిన విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు సాటి రాగల వారెవ్వరూ లేరు. ఇప్పటిదాకా ఆ రాష్ట్రాన్ని ఏలిన సీఎంలు అంతా గూండారాజ్ ను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెంచి పోషించిన వారేనన్న వాదనా లేకపోలేదు. అయితే వారందరికి భిన్నంగా అడుగులేసిన నితీశ్ కుమార్, తొలిసారి అధికారం చేపట్టిన వెంటనే గూండారాజ్ పై కత్తి దూశారు. పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించి తుపాకీ రాజ్యానికి స్వస్తి చెప్పారు. అంతకుముందు పనిచేసిన సీఎంలు అందరూ ఆస్తులు కూడబెట్టుకుంటే, నితీశ్ మాత్రం మిస్టర్ క్లీన్ అనే బిరుదు మాత్రం అందుకున్నారు.
ఇక ఆస్తుల విషయానికి వస్తే.... నితీశ్ కుమార్ ఆస్తుల విలువ కేవలం 59.3 లక్షలేనట. అదే ఆయన పుత్రరత్నం నిశాంత్ కుమార్ పేరిట రూ.2.14 కోట్ల ఆస్తులున్నాయట. అంటే సీఎంగా ఉన్న తన తండ్రి కంటే కూడా నిశాంత్ కుమార్ మూడు రెట్ల మేర అధికంగా ఆస్తులు కలిగి ఉన్నాడు. ఇక నితీశ్ కుమార్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ కు రూ.1.12 కోట్లు ఉన్నాయి. అంటే, సీఎం కంటే డిప్యూటీ సీఎం ఆస్తుల విలువ రెట్టింపన్నమాట.
సీఎం కంటే రెట్టింపు ఆస్తులున్న డిప్యూటీ సీఎంకు మాత్రం సొంత కారు లేదట. ఇక లాలూ పెద్ద కొడుకు, బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు రూ.1.5 కోట్ల ఆస్తులున్నాయట. తేజస్వీకి సింగిల్ కారు లేకున్నా, తేజ్ ప్రతాప్ కు మాత్రం రూ.30 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు, రూ.15.4 లక్షల విలువ చేసే బైకు ఉన్నాయని పేర్కోన్నారు. జల వనరుల శాఖ మంత్రి లల్లన్ సింగ్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించారు. ఆయన ఆస్తుల విలువ రూ. 4.4 కోట్లు. కాగా, చివరి స్థానంలో మంత్రి అనితాదేవి ఉన్నారు. ఆస్తుల విలువ రూ.8.4 లక్షలతో అనితా దేవి చిట్టచివర నిలిచారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more