దేశరాజధాని ఢిల్లీ శివారులో మరో దారుణం జరిగింది. ముగ్గురు దుండగులు ఓ బాలికను కిడ్నాప్ చేసి 15 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను పిస్టల్తో కాల్చి నీళ్లులేని 30 అడుగుల లోతు బావిలో పడేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆ అమ్మాయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర రక్తస్రావం... శరీరం విలవిల్లాడుతున్నా బతకాలన్న కోరిక ఆ 15 ఏళ్ల బాలిక ప్రాణాలను నిలిపివుంచింది. తెల్లవార్లూ బావిలోనే ఉన్న ఆ బాలిక అరుపులు విని స్థానికులు వచ్చి రక్షించారు. దేశానికే కాకుండా అత్యాచారాలకు కూడా రాజధానిగా మారిన ఢిల్లీలో జరిగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె, తన ఉదంతాన్ని పోలీసులకు వివరించింది.
గత నెల 22న పశ్చిమ ఢిల్లీలో పోలీసులు వెల్లడించిన ఆ వివరాల ప్రకారం, పశ్చిమ ఢిల్లీలో నివాసం ఉండే పూనమ్ (పేరు మార్చాం) నవంబర్ 22న తన మొబైల్ ఫోన్ కోసం సిమ్ కార్డును కొనుగోలు చేసేందుకు సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వచ్చింది. ఆమెకు అప్పటికే పరిచయం ఉన్న క్రిషన్ అనే వ్యక్తి ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. ఆపై అతనికి మరో ఇద్దరు మైనర్ బాలురు కలిశారు. వారంతా కలసి 15 ఏళ్ల బాలికను గ్రేటర్ నోయిడాలోని ఓ గ్రామం వెలుపల ఫాంహౌజ్లో బంధించారు. 5 రోజుల పాటు ఆమెపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. ఓ రోజు రాత్రి ఆ అమ్మాయి వీరి నుంచి తప్పించుకుని పారిపోయిందుకు ప్రయత్నించగా, దుండగులు ఆమెను కాల్చి బావిలో పడేశారు.
చనిపోయిందని భావించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు చుట్టుపక్కలవారు బాధితురాలి కేకలు విని, బావిలో నుంచి ఆమెను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఓ మోటార్ బైకుపై ఆ అమ్మాయిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఛాతీ, పొత్తికడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్లడం వల్ల ఎక్కువగా రక్తస్త్రావం అయినా, ఓ రాత్రి చికిత్స లేకుండా గడిపినా బాధితురాలు బతికుండడం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నా.. స్పృహలో ఉందని వైద్యులు తెలిపారు. కృష్ణ అనే వ్యక్తి మరో ఇద్దరు మైనర్లతో కలసి ఈ దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు చెప్పింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more