కేంద్రంలో కోలువుదీరిన నరేంద్రమోడీ ప్రభుత్వం స్థబ్దుగా తన పెంపు కార్యక్రమాలను చేపడుతూనే వుంది. మొన్నటికి మొన్న స్వచ్చా భారత్ సెస్ దేశ ప్రజలపై రుద్దిన కేంద్రం.. జీ ఎస్ టీ పేరుతో మరో బిల్లును కూడా పార్లమెంటులో పాస్ చేయించుకునేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ బిల్లు పాస్ అయితే ప్రజలపై అదనంగా కొంత పన్ను భారం పడుతుందని అర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ లోపు ఇటు రైల్వే శాఖ మరోసారి ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్ధమైంది.
రైల్వేలలో టిక్కెట్ లభించడం సులువే కానీ, బెర్త్ కన్ ఫామ్ కావడం మాత్రం కష్టమేనన్న విమర్శలు వస్తున్నాయి. సంస్కరణల పేరుతో టికెట్ ధరల పట్టికను సవరించిన రైల్వే శాఖ, ఆదాయం మరింత పెంచుకునేందుకు రిజర్వేషన్ల ఉపసంహరణ ధరలను అమాంతం పెంచేసింది. అయితే ప్రయాణికులు టిక్కెట్ ను రద్దు చేసుకుంటే విధించే ధరలు.. రైల్వే శాఖ నుంచి టిక్కెట్టు బుక్ చేసుకున్న ప్రయాణికులకు టిక్కెట్టు రద్దయితే మాత్రం ఆ శాఖ ప్రయాణికులకు తిరిగి చెల్లించే డబ్బులో మాత్రం పెంపు కనబడటం లేదు. అంతేకాదు ప్రయాణికులు చెల్లించిన మొత్తం నుంచి అవి ఇవి అంటూ కొంత మిహనాయించుకుని ఆ తరువాత మూడు నెలలకు డబ్బును ఖాతాలో జమచేస్తున్నారు. ఈ మొత్తం ఒక్కోసారి ఆరు నెలల సమయం కూడా పడుతుంది.
రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కోరుతున్న రైల్వే శాఖ, వివిధ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా మరిన్ని నిధులు రాబట్టాలని భావిస్తోంది. ఇంతలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు రవాణా వ్యవస్థలో 5 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు హాఫ్ టికెట్ విధానం అమలులో ఉండేది. ఇకపై అర్ధ ఛార్జీ అనే మాట ఉండదని రైల్వే శాఖ చెబుతోంది. ఈ మేరకు నిబంధనలు సవరించనుంది. 5 ఏళ్లు దాటిన ఎవరైనా రైలెక్కితే పూర్తి ఛార్జీ చెల్లించాల్సిందేనని రైల్వే శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ నిబంధన 2016 ఏప్రిల్ నుంచి అమలులోకి రానుందని వారు వివరిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more