ఇంటర్ తొలి సంవత్సరం చదవుతున్న విద్యార్థులకు ఉన్నత విద్య ప్రతిబంధకంగా మారుతుంది. అదెలా అంటే.. ప్రభుత్వం వారికిచ్చే ఫీజు రియంబర్స్ మెంట్ అందుతుందా అన్న అనుమానాలు వారిలో కలుగుతున్నాయి. పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలో భాగంగా ఇంటర్మీడియట్ తొలి సంవత్సరంలో అడుగుపెట్టారు. కోటి ఆశలతో ఎదురుచూసిన విద్యార్థులకు స్కాలర్ షిప్ అందోళన కలిగిస్తుంది. గత నెల 30లోపు ఉన్నత విద్యను అభ్యసించే పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు స్కాలర్ షిఫ్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఇంతవరకు బాగానే వున్నా గతంలో స్కాలర్ షిప్ పోందిన విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోనలేదు. అయితే తొలిసారిగా స్కాలర్ షిఫ్ ల కోసం దరఖాస్తు చేసుకోబోయే విద్యార్థులు ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు మాత్రం ఎర్రర్ గ్రహణం పట్టి పీడిస్తుంది. తెలంగాణ ఈ పాస్ పైట్ ద్వారా ధరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఎంతగా ప్రయత్నించినా.. గత నెల 27 నుంచి విద్యార్థులకు ఎర్రర్ ఇబ్బంది పెడుతోంది.
అసలే సైట్ లో తమ వివరాలను అప్ లోడ్ చేస విద్యార్థుల సంఖ్య అధికం కావడంతో సైట్ నెమ్మదిగా స్పందించి.. అనేక పర్యయాలు ప్రయత్నం చేసిన తరువాత వివరాలన్నీ తీసుకున్న పిమ్మట.. మీ ధరఖాస్తు అప్ లోడ్ చేస్తున్న సమయంలో ఎర్రర్ సంభవించిందంటూ ఓ మేసేజ్ రావడం విద్యార్థులను కలవరానికి గురిచేసింది. దీంతో అదే పనిగా విద్యార్థులు 28, 29. 30 తేదీలలో ప్రయత్నం చేసినా.. అదే సమాధానం. దీంతో నెట్ సెంటర్ల వద్ద 29. 30 తేదీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థుల, వారి తల్లిదండ్రులు గుమ్మిగూడారు.
ఈ పరిస్థితులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 15 వరకు స్కాలర్ షిఫ్ లను దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు ఉపశమనం కల్పించింది. అయితే గతంలో మాదిరిగా చివరి రోజున ఇబ్బందులు ఎందకని 1వ తేదీ నుంచి విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం తమ వివరాలను అప్ లోడ్ చేయాలని ప్రయత్నించగా, వారికి మళ్లీ చేదు అనుభవమే ఎదురవుతుంది. ఎర్రర్ అడ్డుగోడ వారికి ప్రతిభందకంగా మారుతుంది. దీంతో తమకు ఈ ఎర్రర్ గ్రహణం వీడి తమ వివరాలు సైట్ లో అప్ లోడ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం విద్యార్థులు కోరుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more