అది పాకిస్థాన్ లోని లాహార్ రైల్వే స్టేషన్లలో సంజౌతా ఎక్స్ ప్రెస్ రైళ్లో ఒంటరిగా కూర్చోనివున్న ఓ ఏడు ఎనమిదేళ్ల చిన్నారిని.. దిగాలుగా వుండటం చూసి అక్కున చేర్చుకున్నారు పాకిస్థాన్ రేంజర్లు. అయితే ఏం అడిగినా చెప్పడానికి, కనీసం వినడానికి కూడా అవకాశంలేని బాలిక పరిస్థితిని గమనించిన రేంజర్లు అమెను చేరదీశారు. అలా దశాబ్దమున్నర కాలం గడిచింది. ఇప్పుడామే సంచలనంగా మారింది. ఇరు దేశాల మధ్య వాడిన స్నేహానికి వారధిగా మారింది పాకిస్థాన్లోని గీత తమ బాలికేనంటూ భారత్ లో అమె తల్లిదండ్రులు గుర్తించారు. అయితే ఈ కథలో మరో ట్విస్టు ఏర్పడింది. మొదట్లో అమె కూడా వారిని గుర్తు పట్టింది. అయితే ఇక్కడే ఇప్పుడ అసలు ప్రశ్న తలెత్తింది.
ఈ ఉదయం ఇండియాకు వచ్చిన గీత, బీహార్ నుంచి వచ్చిన జనార్దన్ మహతో తన తండ్రి కాదని చెప్పింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మధ్యాహ్నం వెల్లడించారు. గీత తనవారిని గుర్తు పట్టలేకపోయిందని ఆమె తెలిపారు. బీహారుకు చెందిన మహతో కుటుంబంతో తనకు సంబంధం లేదని గీత చెప్పిందని, గీత చిన్నప్పటి చిత్రాలుగా వారు చూపిన ఫోటోలు తనవి కావని స్పష్టం చేసిందని సుష్మా వెల్లడించారు. దీంతో గీత వ్యవహారం కొత్త ట్విస్ట్ తిరిగినట్లయింది. మరి, ఈ కథ ఎక్కడికి వెళుతుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. ఈ నేపథ్యంలో గీత తండ్రిగా చెబుతోన్న వ్యక్తినుంచి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు శాంపిల్స్ సేకరించారు. ఒకవేళ డిఎన్ఏ పోలితే మాత్రం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
అయితే గీతకు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అండగా నిలిచారు. గీత అమె తల్లిదండ్రులను గుర్తించలేకపోయినా పర్వాలేదని, అమె భారతీయ బిడ్డని, అమె తన తల్లి భరతమాత ఒడికి చేరడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఆ తరువాత అమె తల్లిదండ్రుల కోసం అన్వేషణ సాగిస్తామన్నారు. గీత యోగక్షేమాలను తాము చూసుకోగలమని సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more