జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇంటి వద్ద కొందరు యువకులు హంగామా సృష్టించారు. మద్యం మత్తులో వచ్చిన పలువురు గుర్తు తెలియని యువకులు పవన్ కల్యాన్ నివాసం వద్ద రచ్చ రచ్చ చేశారు. గేటు వద్ద కాపలా వున్న వాచ్ మెన్ పై దాడులకు పాల్పడుతుండగా బౌన్సర్లు వచ్చి అడ్డుకున్నారు. బౌన్సర్ల పైకి కూడా యువకులు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఎదురు తిరిగిన బౌన్సర్లు వారిని పట్టుకునేందుక యత్నించారు. బౌన్సర్ల నుంచి తప్పించుకున్న యువకులు పలాయనం చిత్తగించారు.
అయితే జరిగిన ఘటనపై పవన్ కల్యాన్ బౌన్సర్లు బంజారాహిల్స్ ఫోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ లో వున్న పవన్ కల్యాన్.. దాని నిమిత్తం గుజరాత్ లో వున్నారు. అయితే యువకులు పవన్ కల్యాన్ ఇంటికి ఎదుట హంగామా సృష్టించినందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. సోలీసులు సిసిటీవీ ఫూటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో వున్నారు.
ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పవన్ కల్యాన్ అభిమానులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావడానికి కారణమైన పవన్ కల్యాన్ ను.. ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారని వారు అరోపించారు. టీడీపీకి అండగా వున్న రామోజీరావు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లను స్వయంగా ఆహ్వానించిన చంద్రబాబు.. తమ ప్రభుత్వం అధికారంలో వుండటానికి కారణమైన మూలవిరాట్టులాంటి పవన్ కల్యాన్ కు మాత్రం మంత్రులతో ఆహ్వానాలు పంపుతారా అంటూ వారు నిలదీస్తున్నారు. తిరుపలి సహా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, విజయవాడ, రాజమండ్రి సహా పలు ప్రాంతాల్లో పవన్ అభిమానులు నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more