గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనాబోరా కేసును నిఫ్పాక్షపాతంగా దర్యాప్తు చే్స్తున్న క్రమంలో ఉన్నఫలంగా తనను బదిలీ చేయడంతో మనస్సు నోచ్చుకున్న మాజీ ముంబై పోలీసు కమీషనర్, ఐఎఎస్ అధికారి, ముంబై డీజీపీ రాకేశ్ మారియా.. షీనాబోరా కేసును తాను దర్యాప్తు చేయడంపట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పాము తన గుడ్లను తానే తినేసినట్లు ఓ పారిశ్రామిక వేత్త తన కూతురు ఆస్తి కాజేయడానికి.. క్రూరమృగంగా మారి అమెను అతిదారుణంగా హతమార్చారన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.
ఈ కేసులో మృతి చెందింది షీనాబోరానేనని, అమె పారిశ్రామికవేత్త ఇంద్రాణి కూతరనడానికి కూడా డీఎన్ఏ పరీక్షల నివేదికలు తెప్పించి రమారమి కేసు దర్యాప్తులో కీలక బాగాన్ని విచారించిన సాక్ష్యాధారాలను సమకూర్చుకున్న రాకేశ్ మారియా.. తాను బదిలీ కావడంతో ఈ కేసును దర్యాప్తును కొనసాగించడానికి అసంతృప్తి వ్యక్తం చేశారు. షీనా బోరా కేసును మాత్రం రాకేశ్ మారియానే విచారిస్తారని ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు ఆయనకు కేసు దర్యాప్తు చేయాలని అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది.
కాగా, షీనా బోరా కేసును విచారించేందుకు రాకేశ్ మారియా నిరాకరిస్తున్నట్లు సమాచారం. తాను డీజీపీ హోంగార్డ్స్ గా బాధ్యతలను చేపట్టి, కార్యాలయాన్ని కూడా మార్చిన నేపథ్యంలో తాను ఈ కేసును దర్యాప్తు చేయడానికి అయిష్టత వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించినట్లు సమాచారం. ముంబై పోలీస్ కమీషనర్ గా సమాన స్థాయి హోదా కలిగిన మరో ఐఎఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన తరుణంలో తాను ఈ కేను దర్యాప్తు చేయడం సరికాదని ఆయన వెల్లడించారు.
ఇలా చేస్తే ముంబై పోలీసు వ్యవస్థలో కొత్తగా మరో పవర్ సెంటర్ ఏర్పాడే అవకాశముంది. ఇది పోలీసు వ్యవస్థకు కూడా సహేతుకం కాదని అయన అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే.. కిందిస్థాయి సిబ్బందికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది' అని ప్రభుత్వానికి మారియా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.దీంతో ఈ కేసు అటకెక్కినట్లేనా.. అన్న అనుమానాలను పలువురి వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును నీరుగార్చేందుకే ప్రభుత్వం మారియాకు పదోన్నతి కల్పించిందన్న వార్తల నేపథ్యంలో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును ఇకపై విచారించే అధికారి ఏవరన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more