తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపుతానని మహిళా ఎస్ఐ బెదిరిస్తోందంటూ ఓ స్టూడియో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తమ గూటికి చెందిన పక్షిని రక్షించడంతో దూకుడును ప్రదర్శించిన పోలీసులు ఇద్దరిపై కేసు పెట్టారు. మహిళా ఎస్ ఐపై నామమాత్రంగా కేసులు పెట్టిన పోలీసులు. పిర్యాదుదారుపై మాత్రం కాస్తా కఠినతరమైన సెక్షన్లను నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుప్పూర్ సామాజిక న్యాయం, మానవ హక్కుల విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఉమామహేశ్వరికి, తమ కార్యాలయం సమీపంలో ఫోటో స్టూడియోను నడుపుతున్న భారతీ వాసన్ తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మరింది. దీంతో పెళ్లి చేసుకోవాలని ఇరువురు భావించారు.
కానీ, కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఉమామహేశ్వరి స్టూడియోకి వెళ్లి వాసన్ తో ఘర్షణ పడింది. ఈ ఘర్షణలో ఆగ్రహం చెందిన మహేశ్వరి స్టూడియోలోని వస్తువులను ధ్వంసం చేసి, తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానని వాసన్ ను బెదిరించి స్టేషన్కు వచ్చేసింది. వాసు తనకు డబ్బులు ఇవ్వాలని, అది అడిగేందుకు స్టూడియోకు వెళితే తెల్లకాగితంపై సంతకం తీసుకొని తనను బెదిరిస్తున్నాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. పోలీసులు వాసును స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా ఉమామహేశ్వరిని తాను పెళ్లిచేసుకోకుంటే చంపుతామని బెదిరించిందని తెలిపాడు.
తన స్టూడియోను కూడా ధ్వంసం చేసిందని ఫిర్యాదు చేశాడు. ఇరువురి వాదన, ప్రవర్తన విచిత్రంగా ఉండడంతో సైక్రియాటిస్టులచే పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఉమామహేశ్వరి కేసుపై తిరుచ్చి సహాయ పోలీస్ కమీషనర్కు ఉన్నతాధికారులు నివేదిక పంపారు. ఉమామహేశ్వరి గతంలో పల్లడంలో పనిచేసినప్పుడు కూడా కలకలం రేపింది. కున్నూర్ మేజిస్ట్రేట్ తంగరాజ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడున్నాడంటూ అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. మరి ఈ కేసు ఎక్కడికి దారితీస్తుందో వేచి చేడాల్సిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more