ప్రపంచంలో మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బోలెడన్ని ఆయుధాలతో శత్రుదేశాల్లో ప్రవేశించి దాడులు జరపడం కంటే సింగిల్గా.. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా వెళ్లి అనుకున్న పనిని ‘సైలెంట్’గా పూర్తిచేయాలనే పన్నాగాన్ని అమలు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఉగ్రవాదులకు కులం, మతం, ప్రాంతీయ తత్వాలు లేవని, అధిపత్యం పోరులో భాగంగా ఎంతటి స్థాయికైనా అవి దిగజారుతాయన్నది నిజమని స్పష్టమవుతోంది. ఇందుకు ఉదాహరణే ఎయిడ్స్ బాండ్. తమ పని సైలెంట్ గా కానీచ్చేయడంలో భాగంగా ‘ఎయిడ్స్’ను తమ కొత్త వెపన్గా ఎంచుకుంది. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నతమ ఫైటర్లను శత్రుదేశాలపైకి ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. తమ పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్గా తేలిన 16మంది సాయుధులను ఈ ‘ఆపరేషన్’ కోసం ఎంపిక చేసింది. వీరిలో ఎక్కువ మంది విదేశీయులే కావడం గమనార్హం.
వీరిని ప్రస్తుతం సిరియాలోని హసాకా ప్రావిన్స్ షద్దాది ప్రాంతంలో ఒక గదిలో నిర్బంధించి ఉంచారు. త్వరలో వీరిని సూసైడ్ బాంబర్స్గా ప్రయోగించనున్నారు. గతంలో ఒక ఇండోనేషియా ఫైటర్.. సెక్స్ స్లేవ్(బానిస)కు ఎయిడ్స్ అంటించి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు విక్రయించాడు. తద్వారా వారిలో ఎయిడ్స్ ప్రబలేలా చేశాడు. అంతేకాక తన రక్తాన్ని దానం చేయడం ద్వారా మరింత మందికి ఎయిడ్స్ అంటించాడు. అయితే జూన్లో ఈ వ్యక్తిని ఉరితీశారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన ఐఎస్ ఉగ్రవాద సంస్థ తన ‘ఫైటర్స్’కు ముందస్తుగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్గా తేలిన వారిని శత్రుదేశాలపైకి ప్రయోగించాలని నిర్ణయించుకుంది. ఒకవేళ వారు దొరికిపోతే తమను తాము పేల్చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more