కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరాని దేశవ్యాప్తంగా నెట్ జనులు నుంచి అబాసుపాలయ్యారు. విపక్షాల విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంలో ముందున్న స్మృతి ఇరాని.. ఇప్పటికే తన విద్యార్హతల విషయమై కోర్టులో కేసు విచారణను ఎదుర్కోంటున్నారు. అయితే ఇదే సందర్భంలో తన లెటర్ హెడ్ లో తప్పులు దొర్లాయి. ఆ తప్పులు అమె లేఖ సారంశంలో కాకుండా.. ఏకంగా లెటర్ హెడ్ లో నీలి రంగులో ప్రింట్ చేయబడిన అక్షరాల్లోనే వున్నాయి. అంటే సుమారుగా 15 మాసాలుగా అదే లెటర్ హెడ్ ను వినియోగిస్తున్నా.. కేంద్ర మంత్రివర్యులు.. దానిని సరిచూసుకోకపోవడం.. సవరించేందుకు అదేశాలు ఇవ్వకపోవడంపై నెట్ జనులు తలోమాటా అనేస్తున్నారు. అసలా లెటర్ హెడ్ లో తప్పులు ఎలా బయటపడ్డాయి..? అంటే..
సిబిఎస్ఈ సెకండరీ, సీనిరయర్ సెకండరీ విద్యార్థుల ఫలితాలు వెలువడిన తరువాత.. ఉత్తమ ఫలితాలను సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు.. వారి సేవలను శ్లాఘిస్తూ.. జూలై 11న ఉత్తరాలను పంపింది. ఈ క్రమంలో ఢిల్లీలోని రిచ్చాకుమార్ అనే ఉపాధ్యాయుడు.. తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా.. స్మృతి ఇరానీ ఫేస్ బుక్ అకౌంట్ లోకి వెళ్లి, తన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. మంత్రివర్యా.. మీ లేఖ మాకు అందింది. మమల్ని మా, ప్రతిభను, శ్రమను, గుర్తించి మీరు పంపిన అభినందనలకు ధన్యులమని పేర్కోన్నాడు.
అయితే తాను గత 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో వున్నందున్న, అందులోనూ బాషా పండితుడను అయినందున.. ఉండబట్టలేక ఈ విషయాన్ని మీ దృష్టికీ తీసుకువస్తున్నాను. మీ లెటర్ హెచ్ లో సన్ సధన్, మినిస్టర్ అనే రెండు పదాలు తప్పుగా అచ్చు అయ్యాయి. వాటిని వెంటనే సవరించుకోండి. దీనిపై మీరు వ్యక్తిగతంగా సమాధానమివ్వాల్సన అవసరం ఏర్పడుతుందని పేర్కోన్నాడు. కనీసం మీ మంత్రిత్వ శాఖలో, మీ కోసం పనిచేసేవారినైనా ఉన్నత విద్యలను అభ్యసించిన వారిని ఏర్పటు చేసుకోవాలని కోరాడు. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ కావడంతో కొందరు మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా.. అమె దీనిపై స్పందించారు. తన పేరును కూడా తాను హిందీలో తప్పుగా రాయనని సమాధానమిచ్చారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more