telangana acb probe quickly in cash for vote case

Telangana acb speedenup cash for vote case

telangana, ACB, cash for vote case, politicians, AP police officials, notices to few politicians, notices to AP police officials, acb speedenup cashfor vote case, sunitha reddy, mathaiah jerusalem, jimmybabu, horde riding,

Telangana ACB speedenup cash for vote case, yet to serve notices to few politicians and police officials within 3 to 4 days

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్.. నిందితులకు సహరికించిన పోలీసులకు, నేతలకు నోటీసులు

Posted: 08/15/2015 03:48 PM IST
Telangana acb speedenup cash for vote case

ఎవరెన్ని కుట్రలు పన్నినా తనను ఎవరు ఏమీ చేయలేకపోయారిని బీరాలు పోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 69వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది తెలంగాణ ఏసీబి. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కొండల్ రెడ్డి, జిమ్మిబాబులకు కొందరు పోలీసులు, రాజకీయ నాయకులు సహకరించినట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సంపాదించారు. కొండల్ రెడ్డి, జిమ్మిబాబుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు యువనేత.. నారా లోకేష్ కారు డ్రైవర్గా పనిచేస్తున్న కొండల్ రెడ్డితో పాటు తెలుగు యువత నాయకుడు జిమ్మిబాబులను విచారణకు హాజరుకావాల్సిందిగా కూడా ఏసీబి అధికారులు చెప్పారు. అయితే ఈ కేసు నేపథ్యంలో తనకు ఎలాంటి ప్రమేయం లేకున్నా. తనను విచారణ పేరుతో తెలంగాణ ఏసీభి అధికారులు పదే పదే వేదిస్తున్నారని జిమ్మి బాబు హెచ్ ఆర్సీలో కూడా పిర్యాదు చేశారు. అయితే ఓటుకు నోటు కేసులో.. కొండల్ రెడ్డి, జిమ్మిబాబులను కాపాడేందుకు కొందరు పోలీసు అధికారులు, రాజకీయ నేతలు ప్రయత్నించినట్టు ఏసీబీ అధికారుల వద్ద ఆధారాలున్నట్టు సమాచారం. వీరికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు రెండు మూడు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  ACB  cash for vote case  politicians  AP police officials  

Other Articles