నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మోదీ ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతూ దాడికి సిద్దంగా ఉన్నాయి ప్రతిపక్షాలు. అయితే ఈ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఏం మాట్లాడతారు..? కేంద్రం నుండి ఎంత వరకు బెనిఫిట్ పొందగలరు..? ఎవరు మాట్లాడతారు?? ఇలా చాలా ప్రశ్నలు తెలుగు ప్రజలను వేధిస్తున్నాయి. అయితే పార్లమెంట్ లో ఏపికి ప్రత్యేక హోదా మీద మాట్లాడతామని, ఏదో రకంగా హామీ మీద మాట్లాడిస్తామని ఏపికి చెందిన తెలుగుదేశం నాయకులు పట్టుమీదున్నారు. అయితే పార్లమెంట్ లో మన వాళ్లు నిజంగా మాట్లాడతారా..? లేదా కాగితపు పులుల్లా మారతారా..? అన్నది చూడాలి.
Also Read: నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు.. దాడికి అన్ని పక్షాలు సిద్దం
తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి పార్లమెంట్ సమావేశాల్లో ఏపి ఎదర్కొంటున్న సమస్యల మీద చర్చిస్తామని ముందు నుండి చెప్పుకొస్తున్నారు. మరి సుజనా గారు మాట్లాడతారో లేదంటే మనకెందుకులే అని ఊరుకుంటారో చూడాలి. అయితే మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రాన్ని చూసి మనం బుద్ది తెచ్చుకోవాలి.. కేంద్రాన్ని ముక్కు పిండి తాము కోరిందాన్ని సాధించుకునే తమిళుల ముందు తెలుగు వారు ఎందుకు పని రారు. అసలు రాజకీయంగా చూసినా, అభివృద్దిలో చూసినా వారే మన కన్నా ముందుంటారు. కానీ మన తెలుగు వారు మాత్రం వాళ్లను చూసి ఏమీ నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉంది. అలాంటప్పుడు బాగా వత్తిడి తీసుకురాగలిగితే ఎంతో కొంత లాభం చేకూరుతుందన్న మాట వాస్తవం. కానీ మన వాళ్లు ఎంత వరకు అందులో సఫలీకృతం అవుతారో చూడాలి.
Also Read: ఏపికి ప్రత్యేక హోదా పక్కా అంటున్న కేంద్ర సహాయ మంత్రి
ఇక తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోంది అంటూ తెలంగాణ నేతలు అంతెత్తున లేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిందిపోయి ఇలా పక్షపాత వైఖరిని ప్రదర్శించడం మీద విమర్శల వర్షం కురిపిస్తోంది. అయితే మరి తెలంగాణ నేతలు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎలా స్పందిస్తారు..? కేంద్రం నుండి ఎలాంటి హామీలు రాబడతారు అన్నది చూడాలి. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుండి భారీగా నిధులు వస్తాయని ఊహిస్తోంది. కానీ తెలంగాణ తరఫున పార్లమెంట్ లో గొంతెత్తే వాళ్లు ఎవరు..? ఎలాంటి అంశాలను పార్లమెంట్ లోచర్చిస్తారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో సమాధానం లభిస్తుంది. వీలైనంత వరకు రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుండి వీలైనన్ని హామీలు, నిధులు రాబట్టాలని ఆశిద్దాం.
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more