ప్రత్యేక హోదా ఏపి ప్రజలకు అందని ద్రాక్షగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడం.. అధికారంలోకి వచ్చి ఇంత కాలం కావస్తున్నా కానీ మోదీ సర్కార్ కనీసం ప్రత్యేక హోదా ఊసెత్తకపోవడం మీద పలు అనుమానాలు వస్తున్నాయి. అయితే లేదు..లేదు..అలాంటిదేమీ లేదు.. ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుందని అంటున్నారు ఓ కేంద్ర సహాయ మంత్రి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా త్వరలోనే అది కూడా నెలా, నెలా పదిహేను రోజుల్లో వస్తుందన్నారు టిడిపి ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి. ఏపికి సంబందించిన పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రత్యే రైల్వే జోన్ విషయాన్ని కూడా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజయవాడలో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు.
Also Read: ప్రత్యేకహోదా రానప్పుడు కేంద్రంలో మంత్రులెందుకు...?
ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. మరో నెలా, నెలా పదిహేను రోజుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారాయన. దీనిపై కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి 60 శాతం పని పూర్తైందన్న ఆయన...మరో నెలా, నెలా పదిహేను రోజుల్లో స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే గతంలోనూ సుజనా చౌదరి ప్రత్యేక హోదా మీద మాట్లాడారు. కానీ సుజనా చౌదరి చెప్పిన గడువులో కేంద్రం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే మరి ఈసారైనా సుజనా చౌదరి మాటలు నిజమవుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read: మీ పౌరుషం ప్రత్యేకహదా తేవడంపై చూపండి.. నాపై కాదు: పవన్
విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్థలన్నీ రాష్ట్రానికి వస్తాయన్నారు మంత్రి. పోలవరం ప్రాజెక్టుతోపాటు ప్రత్యేక రైల్వే జోన్ విషయాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. సెక్షన్ 8 ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ చట్టంలో భాగమన్నారు కేంద్రమంత్రి సుజనా. రాష్ట్ర విభజనానంతరం మిగిలిన ఏపీకి ప్రత్యేక హోదాపై అధికార, విపక్షాల మధ్య ఇప్పటికే మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రత్యేక హోదాపై అలుపెరగకుండా పోరాడుతున్నామని అధికార పార్టీ నేతలు చెబుతుంటే..ఇంకా ఎంతకాలం కాలయాపన చేస్తారంటూ విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇలాంటి టైంలో మరో నెలా, నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా వస్తుందని కేంద్రమంత్రి చెప్పడంతో త్వరలో ఎలాంటి ప్రకటన రాబోతోందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
By Abhinavachary
Also Read: ఏపి ప్రత్యేక హోదా లేదు.. నిధులు మాత్రమేనా.?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more