మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మెరుపు సమ్మె నిర్వహించారు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు మెరుపు సమ్మెతో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, దానం నాగేందర్, పొన్నాలతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. వెంటనే మున్సిపల్ ఉద్యోగుల జీతాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల జీతాలను పెంచుతామని, కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం మాట మార్చారని వారు అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్పందించారు. కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ధర్నా మీద తలసాని పెదవి విరాచారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ వారికి సూచించారు.
Also Read: తలసాని శ్రీనివాస్ మంత్రి పదవి ఊస్ట్..?
Also Read: తలసానికి సాలిడ్ షాక్.. సంబరాల్లో టిటిడిపి
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులకు 47శాతం జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుందని అయినా కాంగ్రెస్ వారు ధర్నా నిర్వహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ధర్నా ఎందుకు చేస్తున్నారో కూడా తెలియనంతలా ధర్నా నిర్వహించడం ఏంటని మండిపడ్డారు. అయితే కేసీఆర్ గారి గురించి మాత్రం బాగానే చెప్పుకొచ్చారు తలసాని. గతంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారని.. దానికి కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారని తలసాని అన్నారు. అయితే అడిగింది అందరికి అయితే హైదరాబాద్ లో పని చేస్తున్నకార్మికులకు మాత్రమే జీతాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తలసాని వివరణే ఇవ్వలేదు.
Also Read: మంత్రి తలసాని వార్నింగ్ పై కోపగించుకున్న కవిత..
Also Read: అయ్య బాబోయ్.. తలసానికి కోపం వచ్చింది
తలసాని వీటికి కూడా సమాధానాలు చెప్పవా..
* తలసాని.. మీరు చిల్లర రాజకీయాలు చెయ్యొద్దు అని అనడానికి అర్హత ఉందా.?
* కాంగ్రెస్ నాయకులు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియనంతగా ధర్నా నిర్వహించారా..? మరి మీరు మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో...? ఎందుకు మాట్లాడారో తెలుసా..?
* జీతాలు పెంచండి బాబూ అంటూ మున్సిపాలిటీ కార్మికులు ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా అప్పుడెందుకు మాట్లాడలేదు...? ఇప్పుడెందుకు మాట్లాడారు..?
* మున్సిపల్ కార్మికులు అందరికి జీతాలు పెంచాలని ధర్నాచెస్తుంటే హైదరాబాద్ లొ పని చేస్తున్న వారికి మాత్రమే జీతాలు పెంచితే సరిపోతుందా..?
* కొంత మంది కార్మికులకు పెంచి మరి కొంత మందికి మాత్రం పెంచకపోవడం విభజించు పాలించు పాలసీనా కాదా.?
By Abhinavachary
Also Read: టాలీవుడ్ లో ఎవరికీ.. తలసాని వార్నింగ్..?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more