discussion | jupally krishna rao | palamoor project |rangareddy

Telangana minister jupalli rishna rao challenge the tdp leaders to discuss mahabungar irrigation projects

discussion ,jupally krishna rao,palamoor project,rangareddy

Telangana minister Jupalli rishna Rao challenge the TDP Leaders to discuss Mahabungar irrigation projects. He anouce the dates to discuss the issue in the Assembly committe hall.

టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే: జూపల్లి

Posted: 07/13/2015 08:02 AM IST
Telangana minister jupalli rishna rao challenge the tdp leaders to discuss mahabungar irrigation projects

పాలమూరు ఎత్తిపోతల పథకం మీద నడుస్తున్న మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. పాలమూరు ప్రాజెక్టుల మీద మాట్లాడటానికి ఎన్టీఆర్ భవన్ కు వస్తానని సవాల్ విసిరారు జూపల్లి కృష్ణారావు. అయితే దీన్ని రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ తిప్పికొట్టారు. తాము ఎంతో ఎదురు చూశామని కానీ జూపల్లి మాత్రం రాలేదని వారు అన్నారు. అయితే తాజాగా జూపల్లి మరోసారి తెలుగుదేశం పార్టీ నేతలకు సవాల్ విసిరారు. పాత సినిమాల్లో బాలకృష్ణలా టూం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమా సరే, సెంటర్ నువ్వు చప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అన్నట్లు టిడిపి నాయకులకు సవాల్ విసిరారు.

Also Read:  సవాల్ కు సిద్దమా..? ముక్కు నేలకు రాస్తారా..? జూపల్లి

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బహిరంగచర్చకు నేను సిద్ధమే.. మీరు సిద్ధమేనా? అని మంత్రి జైపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.  అసెంబ్లీ కమిటీ హాల్ వేదికగా ఈనెల 13,15,16 తేదీల్లో చర్చకు రావాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో బహిరంగ చర్చపై గతంలో తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని మంత్రి పేర్కొన్నారు. తాను చెప్తున్న మూడు తేదీల్లో చర్చకు రండి లేదా టైమ్ మీరు డిసైడ్ చేసినా సరే వచ్చేందుకు నేను సిద్ధమే అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చర్చ పెడితే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయని,  అందుకే అసెంబ్లీ కమిటీ హాలులో చర్చిద్దామని అన్నారు.

Also Read:  ప్రతిపక్షాలను తొక్కేస్తున్నారంటున్న రేవంత్ రెడ్డి

చర్చను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయిద్దామని... ప్రజలు, పాత్రికేయులే న్యాయనిర్ణేతలుగా ఉంటారు అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరుజిల్లా తెలుగుదేశం నేతలకు మరోసారి సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బహిరంగ చర్చకు ఎప్పుడైనా తాను సిద్ధమేనని జూపల్లి పునరుద్ఘాటించారు. పాలమూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నానని చెప్తూనే జిల్లా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరి, మోసపూరిత లేఖలతో కేంద్ర ప్రభుత్వాన్ని, సంస్థలను తప్పుతోవ పట్టిస్తున్న తీరును మంత్రి ఎండగట్టారు.

By Abhinavachary

Also Read:  రేపు పాలమూరుకు చంద్రబాబు.. టిఆర్ఎస్ నుండి షాక్

http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/66092-telangana-telugudesam-party-mla-revanth-reddy-one-more-time-fire-on-kcr-and-his-govt-for-mahabubnagar-bund-call.html

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : discussion  jupally krishna rao  palamoor project  rangareddy  

Other Articles