కంటే కదా.. కన్న పేగు బంధం తెలిసేది.. కన్న పేగు మమకారం పంచేది. తన పిల్లలు అకలితో అలమటిస్తే.. తండ్రనేవాడు పస్తులుండైనా.. పిల్లలలకు పట్టెడన్నం తినిపించాలని భావిస్తాడు కానీ.. ఇక్కడ ఓ కరుడుగట్టిన దుర్మార్గుడు ఆకలికి తట్టుకలేక పక్కింట్లోకి వెళ్లి బోజనం చేశాడని అరేళ్ల బాలుడిని విచక్షణ కోల్పయి చావచితకబాదాడు. దెబ్బలకు తట్టుకోలేక ఆ పసి దేహం అసువులు బాసింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని మధురలో చోటుచేసుకుంది. వివరాల్ల్లోకి వెళ్తే..
రాజేంద్ర అనే లారీ డ్రైవర్ మీనాక్షి అనే ఇద్దరు పిల్లల తల్లి మీనాక్షితో కలసి సహజీవనం చేస్తున్నాడు. అమెకు సమీప బంధువు కావడం చేత.. భర్త దూరమైన తమ బిడ్డలను తండ్రిలా ఆదరిస్తాడని అతని పంచన చేరింది. కాగా, మీనాక్షి తన సొంతూరుకు వెళ్తూ పిల్లలిద్దరినీ రాజేంద్ర దగ్గర విడిచి వెళ్లింది. అతను పిల్లలకు భోజనం పెట్టకపోవడంతో.. పిల్లలిద్దరూ అకలితో అలమటించిపోయారు. చిన్నవాడైన ధర్మేంద్ర ఆకలికి తట్టుకోలేక.. పక్కింటికెళ్లి భోజనం చేసి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్ర.. ఆదివారం రాత్రి పిల్లవాడిని చితకబాదాడు.
దీంతో దర్మేంధ్ర అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి మరణించాడు. ఈ విషయం తెలియగానే రాజేంద్ర పరారయ్యాడు. అయితే తమ తల్లి లేకపోవడంతో తమకు బోజనం కూడా పెట్టని రాజేంద్ర, తమ తమ్ముడిని చితకబాది చంపేశాడని, మృతుడి సోదరుడు జితేంద్ర (12) పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి శవాన్ని పోస్టమార్టం నిమిత్తం తరలించి.. దర్యాప్తు చేస్తున్నారు. స్వగ్రామం నుంచి వచ్చిన తల్లి మీనాక్షి తన పిల్లాడిని అకారణంగా పోట్టన పెట్టుకున్నాడని బోరున విలపించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more