రెండు తెలుగు రాష్ట్రాలలో తన వ్యాపారాన్ని విస్తరింపజేసుకుని, విస్తృతం చేసుకునేందుకు లోహియా ఆటో ఇండస్ట్రీస్ యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ఇ-స్కూటర్లు, ఇ-రిక్షాలు, డీజిల్ ఆటోలు విడుదల చేయబోతోంది. ఇందుకోసం ఈ సంవత్సరం 20 మంది డీలర్లను నియమించబోతున్నట్టు కంపెనీ సిఇవో ఆయుష్ లోహియా మీడియా సమావేశంలో వెల్లడించారు. త్వరలోనే ఎపి, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో తమ ఉత్పత్తులు విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. దక్షిణ భారతదేశం మొత్తానికి హైదరాబాద్నే కేంద్రంంగా చేయాలని కూడా కంపెనీ భావిస్తోంది. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో దేశంలో విద్యుత్ శక్తితో నడిచే ద్విచక్ర, త్రిచక్రవాహనాలకు మంచి డి మాండ్ ఉంటుందని లోహియా చెప్పారు.
ఇ-రిక్షాల అమ్మకానికి అవసరమైన అనుమతుల కోసం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. డిమాండ్ను బట్టి ఉత్తరాఖండ్లోని కాశీపూర్లోని ఉత్పత్తి యూనిట్తో పాటు ఎపి, తెలంగాణతో సహా దక్షిణాదిన సైతం ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తామన్నారు. పూర్తిగా దేశీయ సాంకేతిక పరి.జ్ఞానంతో అభివృద్ధి చేసిన తమ విద్యుత్ వాహనాలు ఒకసారి చార్జి చేస్తే రెండు యూనిట్ల విద్యుత్తో 70-80 కిలోమీటర్ల మైలేజి ఇస్తాయన్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more