Vijayawada world s aqua city capital

vijayawada, world's aqua city capital, will develop vijayawada as world's aqua city capital, prathipati pulla rao tables ap agriculture budget, andhra Pradesh agriculture budget, ap agriculture minister prathipati pulla rao, animal husbandry, horticulture, ap cm chandra babu,

will develop vijayawada as world's aqua city capital says prathipati pulla rao as he tables ap agriculture budget in andhra Pradesh assembly

ప్రపంచ ఆక్వా సిటీ రాజధానిగా విజయవాడ

Posted: 03/13/2015 03:47 PM IST
Vijayawada world s aqua city capital

ఆక్వా కల్చర్ లో ప్రపంచ రాజధానిగా విజయవాడను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మత్య్య పరిశ్రమను వృద్ధికారకంగా గుర్తించామన్నారు. చేపల ఉత్పత్తికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. విజయవాడను ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా చేస్తామని హామీయిచ్చారు. మత్య్సకారుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడతామన్నారు. బడ్జెట్ లో మత్స్యశాఖకు రూ.187 కోట్లు కేటాయించారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. లక్షలోపు రుణాలకు వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల లోపు రుణాలు పావలా వడ్డీ ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. పావలా వడ్డీ రుణాలకు రూ. 10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ శాఖ విశ్వవిధ్యాలయానికి 367.70 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు.

వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:..

* ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా  విజయవాడ
* మత్య్య పరిశ్రమను వృద్ధికారకంగా గుర్తించాం
* చేపల ఉత్పత్తికి అనేక పథకాలు
* చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటిస్థానం
* మన రాష్ట్రం పట్టు ఉత్పత్తిలోనే దేశంలోనే రెండో స్థానం
* షెడ్యూల్ కులాల మత్య్సకారుల కోసం అనేక పథకాలు
* సేద్యపు ఖర్చులు తగ్గించడానికి చర్యలు
* ఎరువుల సరైన సరఫరాకు రూ.60 కోట్లు
*  లక్షలోపు రుణాలకు వడ్డీ రాయితీ
* లక్ష నుంచి 3లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ
* పావలా వడ్డీ రుణాలకు రూ.10 కోట్లు
* మార్క్ఫెడ్కు రూ.60 కోట్లు
* గోదాముల నిర్మాణానికి రూ.56 కోట్లు
* నూతన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.367.70 కోట్లు
* రైతు సంఘాలకు వాహనాలు
* 7 జిల్లాల్లో 238 కరువు మండలాలుగా గుర్తింపు
* అనంతపురం జిల్లాలోని మొత్తం మండలాలు
* పశ్చిమ గోదావరిలో 24 మండలాలు
* బిందు, తుంపర్ల సేద్యానికి రూ.144 కోట్లు
* ముడిపత్తి ఉత్పత్తికి రూ. 93 కోట్లు
* పట్టు పురుగుల పెంపకాన్న ప్రోత్సహిస్తాం
* మేలైన మామిడి, జీడిమామిడి ఉత్పత్తులకు ప్రాధాన్యం
* ఈ పాలన ద్వారా జిల్లా కార్యాలయాలు అనుసంధానం
* పశువైద్యశాల ఆధునికీకరణకు రూ.50 కోట్లు
* రూ.5 కోట్లతో పశు వసతి గృహాలు
* కూరగాయలు, రైతుల ప్రోత్సాహకానికి రూ.53 కోట్లు
* చెరకు, వరి పంటలకు అధిక ప్రాధాన్యం
* అనంతపురంలో వేరుశెనగను కాపాడేందుకు సామూహిక స్ప్రింక్లర్ల ఏర్పాటు
* రాయలసీమ జిల్లాల్లో వేరుశెనగకు ప్రత్యామ్నయంగా గోరుచిక్కుడు ఇందుకోసం రూ.8కోట్లు
* రాష్ట్రంలో 190 వ్యవసాయ మార్కెట్ కమిటీలు
* రైతుబంధు పథకం ద్వారా రూ.17కోట్లు రుణాలు రైతులు పొందారు
* 26,830 సహకార సంఘాలున్నాయి
* భూగర్భ జలమట్టం పెంచేందుకు చర్యలు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prathipati pulla rao  Agri Budget-2015  Andhra pradesh  

Other Articles