14 ఆర్థికసంఘం అమలుతో రాష్ట్రాలకు ఆర్థిక పరిపుష్టి లభించిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అన్నారు. లోక్సభలో 2015-16 వార్షిక కేంద్రబడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఆర్థికాభివృద్ధిలో ప్రయాణిస్తుందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను సమానాభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ది చేస్తున్నామన్నారు.
*ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాలు సమభాగస్వామ్యం కలిగి ఉండాలి
* గత 9నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక వృద్ధిని పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నించింది.
* ఆర్థిక వృద్ధి పెంపు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.
* ద్రవ్యోల్బణం 5.1శాతానికి దిగివచ్చింది.
* రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం. ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం.
* పెట్టుబడులకు భారత్ అనువైన ప్రదేశం
* విదేశీమారక నిల్వలు 320 బిలియన్లకు పెరిగాయి.
* దేశంలో ఎక్కువ జనాభా 35 సంవత్సరాల కంటే తక్కువగా వున్న వయస్సు వున్నవారే.
* మేకిన్ ఇండియా పథకం కింద యువశక్తిని ఉపయోగించుకుంటే ప్రపంచంలోనే మనదేశం తయారీ కేంద్రంగా మారుతుంది.
* స్కిల్ ఇండియా పథకం కింద నైపుణ్యంతో కూడిన శిక్షణ అందిస్తాం.
* నూతన పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం కోసం'ముద్ర' బ్యాంకు ఏర్పాటు
* పోస్టాఫీసుల ద్వారా జన్ధన్ యోజన
* బ్యాంకుల ద్వారా రైతులకు వ్యవసాయ రుణాల లక్ష్యం 8.5లక్షల కోట్లకు పెంపు
* గ్రామీణ వ్యవసాయ, మౌలిక సదుపాయాల కోసం రూ.25వేల కోట్లు.
అటల్ పింఛన్ యోజన పథకానికి 50శాతం ప్రభుత్వ సహాయం
* ఈపీఎఫ్లో ఎవరికీ చెందని రూ.3వేల కోట్ల నిధులు వృద్ధుల సంక్షేమం కోసం కేటాయింపు
* సూక్ష్మ సేద్యం కోసం రూ.5300 కోట్లు
* సంవత్సరానికి రూ.12 ప్రీమియంతో రూ.2లక్షల ప్రమాద బీమా యోజన
ఎన్బీఎఫ్సీల కోసం సర్ఫెసీ పథకం
* రూ.500 కోట్ల పెట్టుబడితో వున్న ఎన్బీఎఫీలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.
* మైక్రోఫైనాన్స్ కంపెనీలు కూడా దీని పరిధిలోకి వస్తాయి.
* పరిశ్రమల స్థాపనకు 14 రకాల అనుమతుల కోసం ప్రత్యేక పోర్టల్
* 4వేల మెగావాట్ల సామర్థ్యంతో 5 ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు
* ఈఎస్ఐ బదులుగా ఐఆర్డీఏ అనుమతించిన ఆరోగ్య బీమా పథకానికి అనుమతులు
* ఈపీఎఫ్లో ఉద్యోగులు పింఛను పథకాలు ఎంచుకునే సౌలభ్యం
* ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5వేల కోట్లు
* ఐసీడీఎస్కు రూ.1500 కోట్లు కేటాయింపు
* మౌలిక సదుపాయాల కల్పనకు రూ.70వేల కోట్లు
* రైళ్లు, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం బాండ్లు
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more