Jaitley s reformist outlook doesn t disappoint

India budget 2015-16, arun jaitley budget 2015-16, modi budget 2015-16, indian economy, tax exemption in budget 2015-16, full economic budget, roed maps to reforms in budget 2015-16, GDP, inflation, benefits of union budget 2015-16,

Jaitley did not disappoint as he concentrated on consolidating existing resources, cutting corners here and there, though he provided a major boost to infrastructure.

హెరిటేజ్ సంపద, రక్షణరంగానికి నిధులు, అశోక్ చక్రా నాణాలు మరెన్నో..

Posted: 02/28/2015 02:02 PM IST
Jaitley s reformist outlook doesn t disappoint

దేశంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడివుందని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్టీ అన్నారు. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 కట్టడాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. వీటిలో హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్ కూడా ఒకటిని తెలిపారు. దేశస్థుల కోసం కోత్త బంగారు విధానాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇకపై అశోక చక్రం ముద్రించిన స్వచ్ఛమైన బంగారు నాణాలను విడుదల చేస్తామని చెప్పారు.

రక్షణ రంగానికి రూ. 2,46,727 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. మేక్ఇన్ ఇండియా పథకం ద్వారా రక్షణ పరికరాలు తయారుచేసే దేశీయ సంస్థలకు ప్రోత్సాహం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే నిర్భయ ఫండ్ కు అదనంగా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గత యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉహాది హామీ పధకానికి 5000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు.

దేశంలో విద్యుత్ లోటును భర్తీ చేసేందుకు 4వేల మెగావాట్ల సామర్థ్యంతో 5 ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఉద్యోగుల విషయానికోస్తే. కార్మికు ఆరోగ్య పరిరక్షణకు కూడా పటిష్యమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈఎస్ఐ బదులుగా ఐఆర్‌డీఏ అనుమతించిన ఆరోగ్య బీమా పథకానికి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో కార్మికులు వారికి కావాల్సిన ఆస్పత్రులతో చికిత్స చేయించుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగులు వేతనాలను నుంచి నేరుగా ఈపీఎఫ్‌లో ఖాతాలలోకి వెళ్లి జమ్మయ్యే నగదును కూడా వారు ఎంచుకునే పింఛను పథకంలో జమ్మయ్యేట్లు చర్యలు తీసుకోనున్నామన్నారు. పేదలకు ప్రభుత్వ ప్రయెజనాలను నేరుగా అందించేందుకు తెరచిన జన్ దన్ యోజన పథకం కింద ఖాతాదారులందరికీ డెబిట్ కార్డులు సౌలభ్యాన్ని కల్పించనున్నామని ప్రకటించారు.

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాలకు రూ.100 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన విత్త మంత్రి అరుణ్ జైట్లీ.. విద్యారంగానికి కూడా పెద్దపీట వేశారు. విద్యారంగానికి గాను 68,968 కోట్లు రూపాయాలను కేటాయించారు. అలాగే అభివృద్ది బాటలో పయనిస్తున్న ఐదు లక్షల గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఇక జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడులో ఎయిమ్స్ ఆసుపత్రులను కల్పించనున్నటుల చెప్పారు. అదే సమయంలో కార్పోరేట్ సంస్థలకు కూడా ఆర్థిక మంత్రి కొంత ఊరటను ప్రకటించారు. కార్పోరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రాయితీ నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : union budget 2015  arun jaitley  finance ministry  

Other Articles