No new trains on tracks

government to invest 8.5 lakh crore in railways, railway budget hikes freight charges, suresh prabhu to tap jvs to put railways on track, no new trains on tracks, Rail transport must be made reliable, Rail transport must be made comfortable, Suresh Prabhu debut railway budget, Rail transport should meet global standards, no increse in passenger train fares, railway budget 2015, Railway Minister Suresh Prabhu, suresh prabhu tabled railway budget,Suresh Prabhu no hike in the fares, rail budget-2015, suresh prabhu, venkaiah naidu, railway budget highlights

Railway Minister announces ammendments in railway freight charges

వినబడని కొత్త రైలు కూతలు.. దొడ్డిదారిన వడ్డింపులు..

Posted: 02/26/2015 03:15 PM IST
No new trains on tracks

రైల్వే ఛార్జీలు పెంచట్లేదంటూనే  రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ...దొడ్డిదారిన మోత మోగించారు. సరకు రవాణా ఛార్జీల్లో కాసింత సవరణలు ఉంటాయని ఆయన చెప్పటం విశేషం.  దాంతో రద్దీ ఉన్న మార్గాల్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సిమెంట్, బొగ్గు, ఉక్కు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి సరకు రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. బొగ్గు రవాణా ఛార్జీ 6.3 శాతం, సిమెంట్ 2.7 శాతం, యూరియ 10 శాతం, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా ఛార్జీలు 1 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉంది.

రైల్వే బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి సురేష్ ప్రభు  ఏ మాత్రం కరుణ చూపలేదు. రైల్వే బడ్జెట్లో వంద లోపు కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయని వచ్చిన వార్తలు కేవలం వార్తలుగానే వుండిపోయాయి. సురేష్ ప్రభు తొలిసారిగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఒక్క కొత్త రైలు కానీ, కొత్త జోన్ కానీ లేదు.  ప్రతిపాదనలు, కేటాయింపుల ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ప్రసంగం ముగిసింది. గతానికి భిన్నంగా రైల్వేల గురించి మాత్రమే సురేశ్ ప్రభు ప్రసంగించారు. దీంతో విశాఖ వాసులు ఎంతో కాలంగా నినదిస్తున్న ప్రత్యేక జోన్ ఈ ఏడాది కూడా అటెక్కెక్కింది. ఇటు ఎంఎంటీఎస్ రెండో దశ పనులపై కూడా ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో హైదరాబాద్, శివారు ప్రాంత ప్రజలకు ఈ సారి బడ్జెట్ లోనూ రిక్తహస్తాలు అందించారు.

రైల్వే ఛార్జీలు పెంచట్లేదంటూనే  రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ...దొడ్డిదారిన మోత మోగించారు. సరకు రవాణా ఛార్జీల్లో కాసింత సవరణలు ఉంటాయని ఆయన సూచించారు. దాంతో రద్దీ ఉన్న మార్గాల్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సిమెంట్, బొగ్గు, ఉక్కు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి సరకు రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. బొగ్గు రవాణా ఛార్జీ 6.3 శాతం, సిమెంట్ 2.7 శాతం, యూరియ 10 శాతం, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా ఛార్జీలు 1 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉంది.

మరోవైపు దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గిస్తూ, సౌఖ్యవంతమైన ప్రయాణాన్ని అందించే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు కొత్తగా వినోదాన్ని కూడా జోడిస్తున్నారు. ఇంతకాలం ఈ రైళ్లలో ఉచితంగా టీ, స్నాక్స్, భోజనాలు ఇచ్చేవారు. టికెట్ ధరలోనే వీటి ధర కూడా కలిపి ఉండేది. ఇది ప్రయాణికులకు చాలా సౌఖ్యంగా ఉండేది. దూరప్రయాణాల్లో ప్రత్యేకంగా భోజనాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రైళ్లలో నాణ్యమైన ఆహారమే అందించేవారు. ఇప్పుడు దీనికితోడు వినోదాన్ని కూడా జోడిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway budget 2015  Railway Minister  Suresh Prabhu  

Other Articles