ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండళ్లకు ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్ ను ఒకేసారి విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. వివరాలను తెలిపింది. ఫిబ్రవరి 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ శాసనమండలి స్థానాలకు, తెలంగాణలో ఫట్టభద్రల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నవ్యాంధ్రలోని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల ఉపాద్యయ నియోజకవర్గానికి ఉపాద్యయ కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. అటు తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రల నియోజకవర్గంతో పాటు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఫ్రోఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ దిలిప్ కుమార్ ల పదవీ కాలం ముగియడంతో ఇక్కడ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఏపీ తెలంగాణలోని శాసన మండలి ఎన్నికలు మార్చి 16న నిర్వహించనున్నారు. మార్చి 19న కౌంటింగ్ జరుపుతామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడమే అలస్యమన్నట్లు టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఏ ఎస్ రామకృష్ణను అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ, ఉభయ గోదావరి ఉపాద్యయ నియోజకవర్గానికి చైతన్య రాజు పేరును ఖరారు చేసింది. షెడ్యూల్ వెలువడిన వెంటనే గంట లోపు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. వారిని బరిలోకి దింపింది
.జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more