రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇక రైల్వే టిక్కెట్లు కూడా డోర్ డెలివరీ చేయబడతున్నాయ్. అదేంటని విస్తుపోకండి.. ఇది నిజమే. రైల్వే టిక్కట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారి ఇంటికి టిక్కెట్లు బట్వడా చేయబడతాయి. అంతేకాందండీ ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోగానే డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా లేకుండానే టిక్కెట్లు ఇంటి వద్దకు డోర్ డెలివరీ చేయబడతాయి. అయితే టిక్కెట్లు ఇంటికి చేరిన సమయంలో చెల్లింపులు చేయాల్సి వుంటుంది. ఈ సరికొత్త విధానానికి భారతీయ రైల్వే తెరతీసింది.
ఆన్ లైన్ లో వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను సొందుపర్చడంలో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఈ నూతన విధానాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ లేని కస్టమర్లను కూడా భారతీయ రైల్వే.తమ టిక్కెట్లను బుక్ చేసుకునే వెసలు బాటును కల్పిస్తుంది. రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో సరిపడా డబ్బు లేకపోయినా.. ఇక దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంటి ముంగిళ్లలోకి టిక్కెట్లు చేరుకుంటాయి. అయితే టిక్కెట్లు చేరిన సమయంలో చెల్లింపులు చేయాల్సి వుంటుంది.
ఈ పథకాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా దేశంలోని 200 ప్రధాన నగరాల్లో చేపట్టామని, ఆయా నగరాలలోనే ప్రస్తుతం సర్వీసులు అందజేస్తున్నామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకంలో టిక్కెట్లు పొందాలనుకునే వినియోగదారులు కనీసం ఐదు రోజుల ముందుగానే బుక్ చేయాలని అధికారులు తెలిపారు. అయితే డోర్ డెలివరీలో టిక్కెట్లు పొందేవారు స్లీపర్ టిక్కెట్ పై కనీసం 40 రూపాయలను అదనంగా చెల్లించాల్సి వుంటుందన్నారు. అదే ఏసీ టిక్కెట్లపైన అయితే ఆదనంగా 60 రూపాయలను చెల్లించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు. ఈ పథకం విజయవంతం అయితే ఇక టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీయాల్సిన అవసరం వుండదని భావిస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more