వాళ్లిద్దరూ పోలీసులు.. పౌరుల శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షక భటులు.. అయితే పీకల వరకు మధ్యం తాగిన వారు పరస్పరం వాదులాడుకున్నారు. అంతటితో ఆగకుండా మరోకరిని తుపాకీతో కాల్చి చంపడానికి కూడా సిద్దమయ్యాడు ఓ కానిస్టేబుల్. డిసెంబర్ 31న అర్థరాత్రి ప్రజలు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్న క్రమంలో వారు రోడ్డుపనే బాహాటంగా ఘర్షణకు దిగారు. ఈ విషయం అధికారులకు తెలియకపోవడంతో.. వారిద్దరి ఉపేక్షించారు. కానీ సుమారు 12 రోజుల తరువాత వారి వీధి భాగోతం బట్టభయలైంది. అక్కడే వున్న నిఘానేత్రంలో వారి హంగామా మొత్తం రికార్డు కావంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 31 అర్థరాత్రి కరీంనగర్ జిల్లా గోధావరి ఖనిలోని ఫైవింక్లయిన్ ప్రధాన కూడలి ఇద్దరు పోలీసులు వాదనకు దిగారు. కొత్త సంవత్సరపు వేళ రాత్రి బందోబస్తు, పర్యవేక్షణల కోసం హెడ్ కానిస్టేబుల్ నాయకత్తంలో నలుగురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు వచ్చారు. అయితే షబ్బీర్ అనే కానిస్టేబుల్ మాత్రం ఫుల్ గా మద్యం సేవించి కబర్లు చెబుతున్నాడు. దీంతో విధులను నిర్వహించాల్సింది పోయి, మీరే మద్యం సేవిస్తే ఎలా అంటూ రవి కానిస్టేబుల్ ను నిలదీశాడు. అది కాస్త వారిమద్య వాగ్వాదానికి దారితీసింది. అంతటితో ఆగకుండా తననే ప్రశ్నించి నిలదీస్తావా అంటూ హెడ్ కానిస్టేబుల్ రవి పై షబ్బీర్ తుపాకినీ గురిపెట్టాడు. సహుద్యోగి తుపాకిని లాక్కోవడంతో పెను ముప్పే తప్పింది. లేదంటే ఓ పోలీసు చేతిలో మరో పోలీసు హత్య చేసిన సంఘటన వెలుగుచూసేది. మరి ఇప్పుడైనా పోలీసు అధికారులు చర్యలకు ఉపక్రమిస్తారో..? లేదో వేచి చూడాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more