దేశాన్ని కాపాడాల్సిన వారే దోచేస్తున్నారు. ఉన్నత పదవుల్లోని కొందరు ప్రభుద్ధులు అడ్డదారులు తొక్కుతున్నారు. అత్యాశకు పోయి అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా.., దేశాన్ని కాపాడాల్సిన ఆదాయ పన్ను శాఖ అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారు. సీబీఐ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అంతా అడ్డంగా బుక్కయ్యారు. అక్రమ ఆఫీసర్లంతా కటకటాల పాలయ్యారు. దేశంలో సంచలనం రేపిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొందరు బడా వ్యక్తుల నుంచి పన్ను మినహాయింపు, ఎగవేత కేసుల ఎత్తివేత కోసం లంచాలు తీసుకుంటున్నట్లు సమాచారం అందింది.
వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఐటీ ఉన్నతాధికారులపై రహస్యంగా ఆపరేషన్ నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారం నిజమే అని రుజువు చేసుకున్నాక, అసలు పని మొదలు పెట్టారు. చెన్నై, ముంబై నగరాల్లో దాడులు జరిపారు. ఈ దాడుల్లో కీలక పదవుల్లో ఉన్న అధికారులను చూసిన సీబీఐ విస్తుపోయింది. జాయింట్ డైరెక్టర్లు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు అంతా ఒక యూనిట్ గా ఏర్పడి ప్రముఖుల లావాదేవీలు చక్కదిద్దుతున్నట్లు గుర్తించింది. ఏకంగా చెన్నై ఐటీ శాఖ జాయింట్ డైరెక్టర్ సలోంగ్ యాడెన్ అరెస్టయ్యారు.., అంటే ఐటీ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సీబీఐ అరెస్టు చేసిన మిగతావారిని చూస్తే.., చార్టెడ్ అకౌంటెంట్లు సంజయ్ బండారి, శ్రేయ బండారా, చెన్నై ఐటీ జాయింట్ డైరెక్టర్, సీనియర్ అధికారులు ఉన్నారు. వీరితో పాటు ఐటీ ఇన్వెస్టిగేషన్ టీం చీఫ్ కూడా దొరికిపోయారు. వీరందర్నీ అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ ప్రబుద్ధులు నోరు విప్పితే ఎందరు ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో చూడాలి. డబ్బంతా ఇలా అక్రమార్కుల చేతిలో ఉంటే ఖజానాకు డబ్బులెక్కడినుంచి వస్తాయి.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more