నవ్యాంధ్ర రాజధాని తూళ్లూరు పరిసర ప్రాంతాల్లో దుండగుల అలజడి పై రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని తూళ్లూరు పరిసర ప్రాంతాల్లోనే నిర్మించనున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నాటి అక్కడి రైతాంగం ఆందోళన చెందుతున్నారు. అయితే తమకు లభించే పారితోషకం, నష్టపరిహారం తదితర అంశాలపై బెట్టు వీడని రైతులు.. తమ భూములను ఇచ్చేందుకు సుముఖంగా లేమని ప్రభుత్వానికి తెగేసి చెప్పిన సందర్భంలో వారిని కొత్త సమస్య ఇబ్బందిపెడుతోంది. కొందరు గుర్తు తెలియని దుండగులు వారి పంట పోలాలను ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడంలాంటి చర్యలకు పూనుకుంటున్నారు. వారిని పట్టుకునే లోపు పారిపోతున్నారని రైతులు అరోపిస్తున్నారు.
దీనిపై ప్రభుత్వం స్పందించి అగ్ని ప్రమాదాలపై విచారణ కమిటీని వేశామని తెలిపింది. కమిటీ నివేదిక వచ్చాక రాజధాని పరిసర ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫాక్షన్ రాజకీయాల కోసమే జగన్ కుయుక్తులు పన్నుతున్నట్లు ఆయన ఆరోపించారు. నాలుగు కోట్ల మందికి ఇష్టమైన రాజధాని జగన్ కు ఇష్టంలేదన్నారు. మంత్రివర్యులు కమిటీని వేశామన్న తరువాత కూడా తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో మళ్లీ అగ్గి రాజుకుంది. స్థానికంగా వున్న పోలాల్లో దుండగులు నిప్పు పెట్టారు. దీంతో దుండగులు ఎవరైనా ఉన్నారేమోనని, పొలాల్లో దాక్కున్నారేమోనని రైతులు వెతుకుతున్నారు. రాయపూడికి చెందిన రైతులు కూడా అక్కడకు చేరుకున్నారు.
తమ ప్రాంతంలో మళ్లీ మంటలు వస్తాయేమోనన్న ఆందోళనలో రైతులు కనిపిస్తుంది. పొద్దున్న సంఘటన జరిగి.. దానిపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నా, మళ్లీ సాయంత్రం మంటలు చెలరేగాయి. రాజధాని కోసం గజం భూమి కూడా ఇవ్వబోమని చెప్పిన ప్రాంతంలోనే ఈ తరహా దాష్టీకాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని తమ పోలాలను, పంటలను కాపాడాలని రైతాంగం కోరుతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more