అసోంలోని సోనిట్ పూర్, కొక్రాఝర్ జిల్లాలో ఉగ్రవాదుల జరిపిన మారణహోమంలో మృతుల సంఖ్య ఇవాళ సాయంత్రానికి 70కి పెరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. అసోంలో ఉగ్రవాదుల దాడిని అన్ని రాజకీయ, సామాజిక పక్షాలు ఖండించాయి. అసోంలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అసోంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటిచింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అసోంలో పర్యటించారు. బోడో తీవ్రవాదు నరమేధానికి పాల్పడిన ప్రాంతాలను రాజ్నాథ్ తన శాఖకు చెందిన సహాయ మంత్రి కిరెన్ రిజిజ్జుతో కలసి సందర్శిస్తామన్నారు. అసోం మృతుల వారు అంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం వహించారు.
సోంత రాష్ట్రం కోసం గత దశాబ్దకాలంగా బోడో తీవ్రవాదులు పోరాటం చేస్తున్నారు. అయితే వారి ఏరివేతకు సైనిక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బోడో తీవ్రవాదులు చాలా నష్టపోయారు. ఇటీవల సైనికుల ఎదుర కాల్పుల్లో ఇద్దరు బోడో తీవ్రవాదులు మరణించారు. దాంతో తీవ్రవాదల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సైనికులకు గిరిజనులు సహకరిస్తున్నారని అనుమానించిన తీవ్రవాదులు ఆదివారం రాత్రి సోనిట్ పూర్, కొక్రాఝర్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో 72 మంది మరణించారు. కేవలం 24 గంటలు అయితే ఇంత మంది ఎలా చనిపోయారు. ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో మృతులు కొంత మందే అయితే మిగిలిని వారు ఎలా చనిపోయారన్నదే ప్రశ్నగా మారింది.
ఉగ్రవాదులు దుశ్చర్యపై వార్తలు వెలువడగానే ప్రతీకారేఛ్చతో రగిలిపోయిన ఆదివాసీలు.. చేతులతో ఆయుధాలతో బోడో గ్రామాలపై దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ దాడులను అడ్డుకునేందుకు అప్పటికే పెద్ద సంఖ్యలో పహారా వున్న పోలీసులు వలయాలను దాటుకుని వెళ్లేందుకు యత్నించారు. దీంతో తమ వారిని పోగోట్టుకుని తీవ్ర ఆవేదనలో వున్న ఆదీవాసీలుకు బోడో ఉగ్రవాదులపై కన్నెర్ర చేశారు. దాడులకు యత్నించగా, వారిని పోలీసు తూటాలు కబళించాయి. దాడులు చేయవద్దని పోలీసుల హెచ్చరికలను మీరిన ఐదుగురిని పోలీసులు కాల్చిచంపారు.
బోడా ప్రాంతంతో పాటు సోనిట్ పూర్, కొక్రాఝర్ జిల్లాలో విధించిన కర్ఫ్యూను కాదని ఆందోళనకారులు ప్రతిదాడులకు యత్నించారు. ఇరువర్గాల దాడులతో భీభత్సమయంగా మారిన ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడుందకు పోలీసులు తీసుకున్న చర్యలు పలువురు ఆందోళనకారులను బలితీసుకోగా, మరికోందర్ని క్షతగాత్రులను చేశాయి. పోలీసుల వద్దని వారిస్తున్న అదీవాసీ ఆందోళనకారులు దుకాణాలకు నిప్పుపెట్టారు. రోడ్డు, రైలు మార్గాలను అడ్డుకున్నారు. వారిని చెదరగోట్టేందుకు చేసిన చర్యలు ఫలించకపోవడంతోనే తాము కాల్పులకు పాల్పడాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఉత్తర అసోంలోని పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించామని, పలు ప్రాంతాలలో ఆర్మీ కూడా రంగంలోకి దిగి శాంతిభద్రలను కాపాడటంలో సాయం చేస్తుందని చెప్పారు.
అసోం మారణహోమంలో 18 మంది చిన్నారులు, 21 మంది మహిళలతో పాటు అనేక మంది అసువులు బాసారు. కాగా ఇటీవలి కాలంతో ఇది చాలా క్రూరమైన ఘటనని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ అన్నారు. చిన్నారులను, పాలు తాగే పసికందులను కూడా ఉగ్రవాదులు వదిలిపెట్టలేదని ఇది వారి కర్కషత్వాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. వందల ఏళ్ల కిత్రం అసోంకు వలస వచ్చిన ఆదివాసీలతో పాటు.. ఈ ప్రాంతాలలో స్థిరపడిన ముస్లింలను లక్ష్యంగా చేసుకుని గతంలోనూ బోడో ఉగ్రవాదులు హింసకు తెగబడ్డారు. అసోం జనాభాలో పది శాతం మేర వున్న ఉగ్రవాదులు సుమారుగా ముఫై మూడు లక్షల మంది వున్నారు. వీరంతా ప్రత్యక రాష్ట్రం కావాలని డిమాండ్ తో గత కొన్నేళ్లుగా హింసా మార్గాన్ని ఎంచుకున్నారు.
బోడోలు అడుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం లభించిన నేపథ్యంలో తమ ఉనికికి ముప్పు వాటిల్లుతందన్న అందోళన ఆదివాసీలలోనూ నెలకొంది. అయితే ఆదీవాసీలు వున్న ప్రాంతాలలో అధికంగా బోడోలు నివసించడం.. ప్రత్యక రాష్ట్ర ఏర్పాటుకు ఆదివాసీలు సహకరించకపోవడం కారణంగా ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతాలలో సుమారు 10 వేల మందికి పైగా పౌరులు మరణించారంటే.. అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించవచ్చు. ఇప్పటికైనా ఈ సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారించాల్సిన అవసరం వుంది. మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులపై వుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more