భారతీయ విద్యావంతులను, మేధావులను కోట్ల రూపాయల ప్యాకేజీ కల్పించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఫేస్ బుక్.. నాణానికి మరోవైపు.. మరో దారుణానికి కూడా ఒడిగడుతుందని స్పష్టమవుతోంది. తమ లోపాలను ఎత్తిచూపిన పాపానికి దాడులకు కూడా తెగబడుతోందని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏకంగా కోర్టునే ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ యాజమాన్యం నుంచి తనకు రక్షణ కల్పించాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ మానుకొండ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. ప్రదీప్ కుమార్ కు రక్షణ కల్పించాలని హోంశాఖను రాష్ట్రోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఫేస్బుక్లోని లోపాలను ఎత్తిచూపడం, నంబర్ వన్ స్థానంలో కొనసాగేందుకు సదరు సంస్థ చేస్తున్న మోసాలను ఎత్తిచూపడం.. అతని విజ్ఞానానికి ప్రతీక. అయితే దానిని జీర్ణించుకోలేని వెబ్ సైట్ యాజమాన్యం తనపై దాడులు చేయిస్తోందని ప్రదీప్ కుమార్ కోర్టుకు తెలిపారు. కాలిఫోర్నియాలో పనిచేస్తున్నప్పుడు ఫేస్బుక్లో డాటా సెంటర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యానని, ఆ సందర్భంగా ఫేస్బుక్ లోపాల గురించి వివరించానన్నారు. ఫేస్ బుక్ ఎందుకు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుందో వాళ్లకు కళ్లకు కట్టినట్టు చూపడం, ఉన్నది వున్నట్లు మాట్లాడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే తన పాలిట శాపంగా మారిందన్నారు.
దీంతో తప ప్రతిష్టను దిగజార్చే పనులకు ఫేస్ బుక్ పూనుకుందన్నారు. తనకూ అల్ఖైయిదాకు మధ్య సంబంధాలు ఉన్నట్లు ఫేస్బుక్లో ప్రచారం చేసిందని ఆరోపించారు. మార్పింగ్ ఫొటోలతో పోస్టులు సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. దీంతో కాలిఫోర్నియాలో మనజాలని హైదరాబాద్కు తిరిగి వచ్చాక కూడా తనపై దాడులకు తెగబడుతోందని చెప్పారు. తనపై కత్తితో హత్యాయత్నం చేసేందుకు కూడా ఫేస్ బుక్ యత్నించిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more