షాహీ ఇమామ్ పదవిని తన తరువాత తన కోడుకు కట్టబెట్టాలని మౌలనా సయ్యద్ అహ్మద్ బుఖారీ చర్యలు తీసుకోవడం చట్టబద్దం కాదని, అవి చెల్లనేరదిన ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ మేరకు బుఖారీ తలపెట్టిన దస్తర్ బందీ అనే కార్యక్రమం నిర్వహణపై స్టే విధించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు ప్రతినిధులతో పాటుగా వేడుక నిర్వహించడంపై స్టే విధించాలన్న పిటీషనర్ అభిప్రాయాలను పరిశీలించిన పిమ్మట కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది.
తన తరువాత తన వారసుడిగా తన తనయుడిని జమ్మామసీదులో షాహీ ఇమామ్ గా నియమిస్తున్నారన్న ప్రతివాదుల పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టులోని జస్టిస్ జి. రోహిణీ, జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వారసత్వం చెల్లదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరమేమీ లేదని అభిప్రాయపడింది. వక్ఫ్ చట్టం 1995 ప్రకారం ముఠావల్లి ( మేనేజర్ స్థాయి) అధికారి మాత్రమే నియయించే అధికారాలు వున్నాయని కోర్టు తెలిపింది. ఇమామ్ లను నియమించే అధికారాలు అయనకు లేవని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 22న జరిగే వేడుకను నిలిపివేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక వేళ మౌలనా సయ్యద్ అహ్మద్ బుఖారీ వేడుక ద్వారా తన కోడుకును కొత్త ఇమామ్ గా నియమించినా అది చట్టప్రకారం చల్లనేరదని తెలిపింది. గత కొన్ని ఏళ్లుగా జమ్మా మసీదు అవరణలోనే నివసిస్తున్న ఆయన, అయన కుటుంబసభ్యులను వేడుక చేసుకోనీయకుండా అడ్డుకోవడం తగదని ద్విసభ్య బెంచ్ అభిప్రాయపడింది. ఒక వేళ కొత్త ఇమామ్ గా తన చివరి కుమారిడినో లేక ఇతరులనో బుఖర్ ప్రకటించిన నేపథ్యంలో మరో కేసును నమోదు చేసి విచారణ జరపాల్పింది సూచించింది. షాహీ ఇమామ్ నియామకం జరగుతుందన్న నేపథ్యంలో ధాఖలైన మూడు పిటీషన్లపై కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more