Samaikyandhra sega in vizag old city

samaikyandhra sega in vizag old city, samaikyandhra sega, purna market center, jagadamba center,

samaikyandhra sega in vizag old city

ఓల్డ్ సీటీలో సమైక్యాంద్ర సెగ

Posted: 08/07/2013 07:37 PM IST
Samaikyandhra sega in vizag old city

సమైక్యాంద్రకు మద్దతుగా విశాఖలో బంగారు వెండి వర్తకుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో పూర్ణామార్కెట్ , పాత నగరంలో నిరసన ప్రదర్శన జరిగింది. సమైక్యవాదులు నినాదాలు చేస్తూ కేసిఆర్, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను ఉరేగిస్తూ కురుపాం మార్కెట్ నుంచి జగదాంబ కూడలి వరకు ర్యాలీని నిర్వహించారు. జగదాంబ కూడలిలో దిష్టిబొమ్మలను దహనం చేశారు. పాతనగరంలో పలు దుకాణాలను సమైక్యవాదులు మూసివేయించి బంద్ ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు గోడి నరసింహాచారి మాట్లాడుతూ సీమాంద్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ప్రకటన చేయడాన్ని సీమాంద్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. పార్లమెంట్ లో తెలంగాణకు బిల్లు అమలు చేయకూడదని, సోనియా నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు. అనంతరం పూర్ణామార్కెట్ కూడలిలో సమైక్యాంద్రా నినాదాలతో మానవహారం చేశారు. బస్సులను అడ్డుకున్నారు. రోడ్డు మధ్యలో బైఠాయించి తెలుగు తల్లికి క్షోభ పెడుతున్నావారిని పెట్రోల్ పోసి దహనం చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమాంలో బీఎస్ ఉమామహేశ్వరరావు, బంగారు దుకాణాల యజమానులు, వర్కర్స్, బంగారు వస్తువుల తయారీదారులు పాల్గొన్నారు.

 

పల్లె పోరుబాట

ఆంద్రప్రదేశ్ ను విభజించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పల్లెల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. పలుచోట్ల సోనియాగాంధీ , కేసిఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మండలంలోని చెట్టుపల్లిలో భవన నిర్మాణ కార్మికులు కేసిఆర్ దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా దుంగలను ఉంచి కాసేపు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పెద్దబోడ్డేపల్లిలో వ్యాపారులంతా బంద్ పాటించారు. కూడలిలో గుడారం వేసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. సమైక్యాంద్ర కొనసాగించాలని నినాదాలు చేశారు. కాసేపు కూడలిలో మానవహారంగా ఏర్పాడ్డారు. నర్సీపట్నంలోని విశ్వబ్రాహ్మణులంతా సీబీఎం కాంపౌండ్ నుంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. అబీద్ కూడలిలో మానవహారంగా ఏర్పాడ్డారు. పాల్ఘాట్ సెంటర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళి అర్పించారు. శ్రీకన్య కూడలిలో కేసిఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more