రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక సమర్పించారు. అలాకాని పక్షంలో తెలంగాణలో రాయలసీమను కలపాలని కిశోర్ చంద్రదేవ్ సూచించారు. ఇక ఆంధ్ర ప్రాంతానికి విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాలని నివేదించారు. విశాఖకు రాజధాని అయ్యే అర్హత ఉందన్నారు. విశాఖ అరవై ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, విభజన తర్వాత విశాఖను సీమాంధ్రకు రాజధానిగా చేయాలని కిషోర్ చంద్రదేవ్ డిమాండ్ చేశారు.
1953లో జస్టిస్ వాంచూ కమిషన్ అదే నివేదిక ఇచ్చిందని కిషోర్ చంద్రదేవ్ తెలిపారు.1973లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఇరవై తొమ్మిదవేల ఎకరాలు సేకరించారని, అందులో తొమ్మిదివేల ఎకరాలు నిరుపయోగంగా ఉందన్నారు. ఆర్థిక మండలి కోసం మరో తొమ్మిదివేల ఎకరాలు సేకరించారని, ఈ పద్దెనిమిది వేల ఎకరాలలో పరిపాలనా భవనాలు నిర్మించుకోవచ్చునన్నారు. తక్షణమే భవనాలను అద్దెకు తీసుకొని పాలన సాగించవచ్చునన్నారు.
విశాఖకు దగ్గరగా ఉన్న ఇథర పట్టణాల్లో పాలనా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రతో కలిసి ఉండేందుకు సిద్ధంగా లేరన్నారు. వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి లేదా తెలంగాణ ప్రాంతంలో కలపాలన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఆదాయాన్ని కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (సీమాంధ్ర) 25 అయిదేళ్లు ఇవ్వాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 15 | విశాఖజిల్లాలోని రంప చోడవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన సీఎం కిరణ్ రచ్చబండ కార్యక్రమానికి మంత్రి బాలరాజు హాజరు కాలేదు. రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని మంత్రి బాలరాజును మీడియా ప్రశ్నించగా... తనకు సీఎం... Read more