Student jac egg attacks on purandeswari

student jac egg attacks on purandeswari, Samaikyandhra Student JAC surround Purandeswari, Samaikhyandhra Students JAC, Congress party, Purandeswari Attacked In Visakhapatnam

student jac egg attacks on purandeswari

కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

Posted: 12/07/2013 06:31 PM IST
Student jac egg attacks on purandeswari

రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర ప్రయోజనాలకోసం పట్టుబట్టినట్లు చెప్పారు. మంత్రిపదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని కోరినట్లు చెప్పారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపాలని కోరినట్లు తెలిపారు. భద్రాచలం డివిజన్ ప్రాంతాన్ని ఆంధ్రలో కలపాలని కోరినా తమను ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

 

హైదరాబాద్ ను ఢిల్లీ తరహాలో యూటీ చేయాలని కోరినట్లు చెప్పారు. అసలు ఉమ్మడి రాజధాని అనే అంశం రాజ్యాంగంలో లేదని అన్నారు. శాంతిభద్రతలు గవర్నర్ ఆధీనంలో ఉంచడం అభ్యంతరకరమని అన్నారు. విభజన అనంతరం సీమాంధ్రకు నిధులు ఎలా మంజూరు చేస్తారనే విషయాలు నివేదికలో పేర్కొనలేదని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర విభజన విషయంలో తమను విశ్వాసంలోకి తీసుకోకపోవడం భాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపిన స్థానిక లోక్ సభ సభ్యురాలు, కేంద్ర మంత్రి డి.పురందేశ్వరి నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరించడం పట్ల విశాఖపట్నంలోని విద్యార్థి జేఏసీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజనకు నిరసనగా నగరంలోని పురందేశ్వరి క్యాంపు కార్యాలయాన్ని జేఏసీ నాయకులు చుట్టుముట్టారు. కోడిగుడ్లతో ఆమె నివాసంపై విద్యార్థి జేఏసీ నాయకులు దాడి చేశారు. అయితే కోడిగుడ్ల దాడిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అ క్రమంలో విద్యార్థి నాయకులు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more

  • Cm attending for racha banda program in vizag

    సీఎం సభకు మంత్రి బాలరాజు గైర్హాజరు-చంద్రబాబే కారణం

    Nov 15 | విశాఖజిల్లాలోని రంప చోడవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన సీఎం కిరణ్ రచ్చబండ కార్యక్రమానికి మంత్రి బాలరాజు హాజరు కాలేదు. రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని మంత్రి బాలరాజును మీడియా ప్రశ్నించగా... తనకు సీఎం... Read more