Seemandhra sega ap municipal employees to go on 72 hour strike

seemandhra sega in ap, municipal employees 72 hours strike, ap municipal employees jac, seemandhra staff strike, andhra pradesh municipal employees strike, breaking news, ap politics, political news, andhra news

seemandhra sega ap Municipal employees to go on 72-hour strike

సమైక్యాంద్ర సెగలు - సమ్మె కూత

Posted: 08/05/2013 05:53 PM IST
Seemandhra sega ap municipal employees to go on 72 hour strike

మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది 72 గంటల పాటు విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా విధులకు హాజరు కాలేదు. పారిశుధ్యం, నీటి సరఫరా వంటి అత్యవసర పౌర సేవలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని మున్సిపల్ సిబ్బంది పేర్కొన్నారు. సమైక్య సెగలు చల్లారడం లేదు. వివిధ జిల్లాలో సమైక్య వాదులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలు చేస్తున్నారు. మొత్తం 13 జిల్లాలోని మున్సిపల్ ఉద్యోగులు నుండి విధులు బహిష్కరించారు. తిరుపతిలో మున్సిపల్ సిబ్బంది విధులు బహిష్కరించారు. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులు సమ్మెల్లో పాల్గొంటున్నాయని సిబ్బంది తెలిపారు. విజయవాడలో కూడా సిబ్బంది విధులు బహిష్కరించారు. త్వరలో ఏపీఏన్జీవోస్ సంఘం చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలిపారు. వారు 12వ తేదీన చేపట్టే సమ్మెలో పాల్గొంటామని మున్సిపల్ సిబ్బంది చెప్పారు. ప్రతి జిల్లాలోని విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మూడు రోజుల తరువాత మరోసారి భేటి అయి తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామని మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం తెలిపింది. విజయనగరం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. నాయకులు, విద్యార్థులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్ల దిగ్బంధనం, నిరసన కార్యక్రమాలతో విజయనగరం జిల్లా హోరెత్తుతోంది. చిత్తూరు జిల్లాలో నిరసనలు మిన్నంటుతున్నాయి. కొందరు కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులకు, ఆందోళనకారులు వాగ్వివాదం జరిగింది. ఇక ఎమ్మెల్యే సికె బాబు ఆరోగ్యం క్షిణించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more