Minister thota narasimham resign minister ganta srinivasa rao

minister thota narasimham resign, minister ganta srinivasa rao, Seemandhra ministers resign, telangana issue, telangana state,

minister thota narasimham resign-minister ganta srinivasa rao

మంత్రి తోట రాజీనామా- మంత్రి గంటా పాలాభిషేకం

Posted: 08/08/2013 04:34 PM IST
Minister thota narasimham resign minister ganta srinivasa rao

సమైక్యాంధ్ర కోసం మంత్రి తోట నర్సింహం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. యూపిఏ, సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు రాజీనామాలు చేస్తున్నారు. విశ్వరూప్ పార్టీలకతీతంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని మంత్రి విశ్వరూప్ ఈరోజు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు నేతలు ఈ నెల 12వ తేదీలోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీ విభజనను తెర పైకి తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే తోట త్రిముర్తులు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఆయన కాకినాడ వరకు పాదయాత్ర చేపట్టారు.

 

మంత్రి గంటా నిమ్మరసం

మంత్రి గంటా శ్రీనివాసరావు జీవిఎంసీ ఉద్యోగుల చేపట్టిన నిరవదిక దీక్షా శిభిరానికి చేరుకున్నారు. దీక్ష చేస్తున్న ఉద్యోగులకు గంటా శ్రీనివాసరావు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. సమైక్య రాష్ట్రంపై ప్రకటన వెలువడే వరకు ఉద్యమాలు కొనసాగించాలని మంత్రి గంటా కోరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రాకతో.. ఉద్యోగులు, నిరసనకారులతో, జైసమైక్యాంద్ర అంటూ నినాదాలతో మారుమ్రోగిపోయింది. భారీ సంఖ్యలో ప్రజలకు అక్కడికి చేరుకున్నారు. అయితే అనంతరం గంటా శ్రీనివాసరావు రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేయటం జరిగింది.

 

మంత్రి గంటా సింహగర్జన

ఈ నెల 14న నిర్వహించనున్న సమైక్యవాదుల సింహగర్జన ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగిస్తుందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సింహగర్జన పోస్టర్ ను గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో విడుదల చేశారు. ఆ సింహగర్జన సభకు సీమాంధ్ర ప్రాంతం నుంచి లక్షలాది మంది తరలివస్తారని తెలిపారు. ఆ సభ ద్వారా ఆంటోనీ కమిటీకి సమైక్య ఉద్యమ తీవ్రతను తెలియజేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆంధ్రయూనివర్శిటీలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఈ సందర్భంగా అత్యవసరంగా భేటీ అయింది. సింహగర్జన ఏర్పాట్లు తదితర అంశాలపై విద్యార్థి జేఏసీ చర్చిస్తుంది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more