ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు ఆఫీసు, ఇంటి కార్యకలాపాల్లో బిజీ అయిపోవడంతో వారికి విశ్రాంతి తీసుకునేంత సమయం లభించదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే కూర్చొని వుండటం, తిరిగి ఇంటికిరాగానే ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడం, మరికొందరు ఆఫీసు పని పూర్తవ్వలేదని ఆ పనిని ఇంట్లో చేసుకోవడం.. ఇలా బిజీగానే గడుపుతుంటారు. దీంతో వీరికి విశ్రాంతి తీసుకునే సమయం లభించకపోగా.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒళ్లునొప్పులు, మానసిక ఆవేదన, మైకంగా అనిపించడం, ఇంకా రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే విశ్రాంతి ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని, విశ్రాంతి టెక్నిక్స్ వల్ల హార్ట్ రేట్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి హెల్దీ హార్ట్ను కోరుకుంటున్నట్లైతే శరీరానికి రెగ్యులర్గా విశ్రాంతి అందివ్వడం మంచిది. ప్రతి రోజూ అలసిన శరీరానికి తగినంత విశ్రాంతిని అందివ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు కంట్రోల్ అవుతాయి. ఒత్తిడి తగ్గించుకొన్నట్లైతే శరీర, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే.. విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాలు వదులవుతాయి. తద్వారా అలసట ఆవహిస్తుంది. ప్రతి రోజూ విశ్రాంతి తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రతోపాటు ఒత్తిడిని సునాయాసంగా అధిగమించే తత్త్వం ఉంటే.. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంతేగాకుండా ఏకాగ్రత పెంచుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మనిషి తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల కోపాన్ని కూడా తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మైకంగా, తల తిరిగేలా అనిపిస్తే ఒక నిముషం కూర్చొని, ప్రశాంతంగా విశ్రాంతిగా తీసుకోవాలి. తలతిరగడం నివారించడానికి డీప్ బ్రీత్ తీసుకోవడం ఒక ఉత్తమ హోం రెమెడీ. ఇది బ్రెయిన్కు కావల్సినంత ఆక్సిజన్ను అందిస్తుంది. దాంతో మైకం తగ్గుతుంది. అలాగే డీహైడ్రేషన్ కూడా తలతిరగడానికి ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా వేసవి సీజన్లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఇలాంటి అసమతౌల్య సమస్యను నివారించుకోవచ్చు. తద్వారా చురుగ్గా ఉండొచ్చు. తల తిరిగినట్లు అనిపిస్తే అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది బ్రెయిన్కు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. అల్లం కూడా మైకము తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లాన్ని టీలో చేర్చి తీసుకోవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇలాంటి లక్షణాలతో పోరాడుతుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. తగినంత ఎనర్జీని అందిస్తుంది. తలతిరగడం నివారించడానికి నిమ్మరసం సూపర్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more