ప్రస్తుతకాలంలో టెక్నాలజీ అంచనాలకు మించి దాటిపోతోంది. ఒకదానికి మించి మరొకటి కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. నిత్యజీవితంలో టెక్నాలజీ ఒక సమభాగం అయిపోయింది. వీటి ఉపయోగం లేనిదే.. నిర్వహించుకున్న పనులు అస్సలు జరగవు. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఈ టెక్నాలజీకి బానిసలుగా మారిపోయారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఒక జీవనాధారాంగా ఈ టెక్నాలజీ మారిపోయింది.
అందులో భాగంగానే రకరకాల గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్ ఇలా చాలా రకాల టెక్నాలజీ ప్రొడక్ట్స్ వున్నాయి. ఇవి సామాజానికి ఎంతో ఉపయోగపడే పరికరాలు. సెల్ ఫోన్లు దూరప్రాంతాల్లో వున్నవారితో సంభాషించుకోవడానికి పనికొస్తుంది. అయితే నేటి యువకులు ఏవో కొత్త కొత్త యాప్స్ వచ్చాయని ఎడతెరిపి లేకుండా వీటిని వాడుతున్నారు. ల్యాప్ టాప్ లు ఆఫీసుకు సంబంధించిన కార్యక్రమాలను, పనులను నిర్వర్తించుకోవడానికి ఉపయోగిస్తారు. అలాగే పాటలు వినడానికి ఐప్యాడ్ లు ఇంకా రకరకాలు గ్యాడ్జెట్స్ ఎన్నో మార్కెట్లలో లభ్యమవుతున్నాయి.
అయితే ఇటువంటి గ్యాడ్జెట్స్ ను నిరంతరం వాడటం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల కొత్తకొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయి. విద్యార్థులు ఈ గ్యాడ్జెట్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో తమ విలువైన విద్యను కోల్పోతున్నారు. అలాగే ఎక్కడైనా బయటికి వెళ్లినప్పుడు కూడా వీటిని వాడుతుండటంతో యాక్సిడెంట్లు కూడా సంభవిస్తున్నాయి. నలుగరిలో సేఫ్టీ కూడా లోపిస్తోంది.
గ్యాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు :
1. గ్యాడ్జెట్స్ వాడకంలో మంచి అనుభవాలు వున్నప్పటికీ వాటిలో కొన్ని నష్టాలను కూడా కలుగజేస్తాయి. అవేమిటంటే.. నిత్యం వీటిని వాడుతుండడంతో నిర్దిష్టమైన సమయం అంటూ తెలియదు. రాత్రి సమయంలో కూడా నిద్రపోకుండా దీనిని ఉపయోగిస్తుంటారు. ఇతరులతో చాటింగ్ చేయడం, గేమ్స్ ఆడుకోవడం లేదా ఆఫీసులో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలనే నెపంతో వీటిని ఇళ్లలో కూడా నిరంతరం ఉపయోగిస్తూనే వుంటారు. ఫలితంగా సమయం ఏమవుతుందోనన్న అస్సలు ధ్యాసే వుండదు. దీంతో మీరు నిద్రకు సంబంధించిన రుగ్మతలను ఎదుర్కోవాల్సి వుంటుంది. అధికంగా వీటిని వాడితే మీరు నిద్రలేమి (ఎక్కువ సేపు నిద్రపోకుండా వుండటం)కి గురవుతారు.
2. గ్యాడ్జెట్లను నిరంతరం వాడడంతో కళ్లు దురదగా వుండటం లేదా మంటగా వున్నట్లు అనిపిస్తుంది. ఎక్కువసేపు వీటిని చూడటం వల్ల కళ్లు అలసిపోయి, ఒత్తిడికి గురవుతాయి. దీంతో కళ్లు ఎంతో నొప్పిగా బాధిస్తాయి. ఫలితంగా కళ్లు పొడిబారిపోయి, రకరకాల వ్యాధులకు, ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది.
3. ప్రస్తుతకాలంలో శాస్త్రజ్ఞులు నిర్వహించిన పరిశోధనల్లో... నిరంతరం చెవులలో ఇయర ఫోన్స్ (హెడ్ సెట్) పెట్టుకోవడంతో లోపలి చెవులలోని కణజాలంలో వుండే మైక్రోస్కోపిక్ హెయిర్ ప్రభావితం చెందుతుందని నిర్ధారించారు. దీంతో చెవులు సరిగ్గా వినబడకుండా పోతాయి. కాబట్టి నిర్ణీత సమయాల్లో వాటిని ఉపయోగిస్తే మంచిది.
4. గ్యాడ్జెట్లను నిరంతరం వాడటం వల్ల వాటి రేడియేషన్ మానవ ఆరోగ్యానికి ఎంతో ప్రభావితం చేస్తాయి. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తే.. బ్రెయిన్ డెవలప్ మెంట్ కు ఉపయోగపడే ఫీటస్ ను ప్రభావితం చేస్తుంది. అలాగే పురుషులు 18 గంటల కంటే ఎక్కువగా వీటిని ఉపయోగిస్తే.. స్పెర్మ్ కౌంట్ ఒక్కసారిగా తగ్గిపోతుందని శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా హెచ్చరిస్తున్నారు. అలాగే క్యాన్సర్ కు కారణమయ్యే ఐయొనైజింగ్ రేడియేషన్స్ కూడా ఈ గ్యాడ్జెట్స్ నుంచి వెలువడుతాయి. ఇవి లుకేమియా, స్కిన్, థైరాయిడ్, బ్రెస్ట్, కడుపుకు సంబంధించిన రకరకాల క్యాన్యర్ వ్యాధులకు దారితీస్తాయి.
5. గ్యాడ్జెట్లను నిరంతరం వాడటంతో మానసికంగా ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది. తలనొప్పి అధికం అవుతుంది. వీటితో ఉపయోగిస్తూ నిరంతరం కూర్చోవడంతో బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది. మరికొంతమంది ఈ గ్యాడ్జెట్స్ కు బానిసలైపోయి స్థూలకాయలుగా కూడా మారిపోతున్నారు. అనవసరంగా కోపతాపాలకు గురవుతారు.
ఇలా ఈ విధంగా గ్యాడ్జెట్లను నిరంతరం వాడడంతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more