జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేసియా మాస్టర్స్లో భారత స్టార్ షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. టోర్నీలో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్ల్లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ వరుస సెట్లలో గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగుపెట్టారు. ఇండోనేసియాకి చెందిన మార్సిక తేజంగ్పై 23-21, 21-7 తేడాతో ఈరోజు పీవీ సింధు గెలుపొందగా.. జపాన్కి చెందిన కెంటో నిశిమాటోపై 21-14, 21-9 తేడాతో కిదాంబి శ్రీకాంత్ అలవోక విజయం సాధించాడు.
టోర్నీలో భాగంగా క్వార్టర్స్లో పీవీ సింధు.. స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోవైపు శ్రీకాంత్.. ఇండోనేసియాకే చెందిన జనాతన్ క్రిస్టీతో పోటీపడాల్సి రావొచ్చు. నిన్న తొలి మ్యాచ్లో చైనాకి చెందిన లీ జురుయ్తో పోటీపడిన పీవీ సింధు 22-24, 21-8, 21-17 తేడాతో అతి కష్టంగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. శ్రీకాంత్ మాత్రం నిన్నటి తరహాలోనే ఈరోజు కూడా జోరు కొనసాగించి వరుస సెట్లలో విజయం సాధించాడు. నిన్న తొలి రౌండ్లో మలేసియా షట్లర్ చాంగ్ వి ఫెంగ్పై 21-12, 21-8 తేడాతో శ్రీకాంత్ ఓడించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more