మకాపు ఓపెన్ నుంచి భారత్ నిష్ర్కమించింది. అటు పురుషుల సింగిల్స్, ఇటు మహిళల సింగిల్స్ సహా అన్ని విభాగాల నుంచి భారత్ నిష్క్రమించింది. మోకాలి గాయం తరువాత ఫామ్లేమితో సతమతమవుతున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి పరాజయం పలుకరించింది. దీంతో అమెకు నిరాశ ఎదురైంది. గాయం నుంచి కోలుకున్నాక ఫామ్ లోకి వచ్చే వరకు అగకుండా ఆత్రుతగా వచ్చినందు వల్లే అమె తడబాటుకు గురవుతున్నారన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సైనా ఓటమి చవిచూసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో సైనా 21-12, 21-17 స్కోరుతో ఝంగ్ యిమన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. ఇటీవల జరిగిన హాంకాంగ్ ఓపెన్లో కూడా సైనా క్వార్టర్స్లోనే పోరాటం ముగించింది. ఇక మరోవైపు భారత ఏస్ షట్లర్ సాయి ప్రణిత్ కూడా క్వార్టర్ ఫైనల్స్ లో పరాజయం పాలయ్యాడు. మకావు ఓపెన్ గ్రాండ్ ఫ్రిక్స్ గోల్డ్ బాడ్మింటన్ టోర్నీలో అయన చైనాకు చెందని జో ఝున్ పెంగ్ చేతిలో ఓటమిపాలయ్యాడు.
తొలి సెట్ లో నువ్వా నేనా అన్నట్లు రాణించిన ప్రణిత్.. రెండు పాయింట్ల తేడాతో ఓటమిపాలవ్వగా, రెండో సెట్ మాత్రం ఏ కోశాన చైనా క్రీడాకారుడు పెంగ్ ను నిలువరించలేకపోయాడు., దీంతో ముఖాముఖిగా తలపడిన క్వార్టర్ ఫైనల్స్ లో 19-21,9-21 పాయింట్లతో పరాజయం పాలయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ ఆద్యంతం చైనా క్రీడాకారుడు పెంగ్ అధిపత్యమే సాగింది. కాగా ఈ మ్యాచ్ కేవలం అరగంట వ్యవధిలోనే ముగియడం ప్రత్యర్థి ప్రతిభను తెలియజేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more