రియో పారా ఒలింపిక్స్లో భారతీయ దివ్యాంగ క్రీడాకారులు తమ సత్తాను చాటుతున్నారు. రియోలో ఒక రజతం, కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్.. పారా ఒలంపిక్స్ లో మాత్రం దూసుకుపోతుంది. రియో ఒలంపిక్స్ లో షట్లర్ విసీ సిందూ రజత పతకం సాధించగా, రెజ్లర్ సాక్షి మాలిక్ క్యాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. దీపా కాసింతలో పతకాన్ని చేజార్చుకుంది. కానీ మిగత ఏ ఒక్క క్రీడాకారులు కూడా ప్వర్ణం పతకాన్ని సాధించలేకపోయారు. అయితే రియో పారా ఒలంపిక్స్ లో మాత్రం అందుకు భిన్నంగా సాగుతుంది.
అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న ఆటగాళ్లు సాధించలేని ఘనతను దివ్యాంగులు సాధించి దేశ పరువు ప్రతిష్ఠలను నలుదిశలా ఇనుమడింపజేస్తున్నారు. రెండు స్వర్ణ పతకాలను ఇప్పటికే తమ ఖాతాలోకి వేసుకున్న క్రీడాకారులు.. మరో రజత, కాంస్య పతకాన్ని కూడా సాధించిన విషయం తెలిసిందే. హైజంప్ లో తమిళనాడుకు చెందిన ఆటగాడు భారత్ కు రియో పారా ఒలింపిక్స్ లో తొలి స్వర్ణ పతకం సాధించాడు.
తాజాగా జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝుఝురియాకు స్వర్ణ పతకం వచ్చింది. 63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరిన ఝుఝురియా ఇప్పటి వరకు జావెలిన్ త్రోలో భారత ఆటగాళ్లు ఎవరూ చేయలేని ప్రదర్శనను చేయడం విశేషం. కాగా, ఈ పతకంతో రియో పారా ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more