ఉన్నఫళ్లంగా రియో ఒలంపిక్స్ జరిగితే భారత్ కేవలం ఐదు మెడల్స్ తో సరిపెట్టుకోవాల్సివస్తుందని అమెరికాకు చెందిన గ్రేస్ నోట్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఒలంపిక్స్ జరిగిన పక్షంలో అమెరికాయే అందరికంటే అధిక మెడల్స్ సాధిస్తుందని జోస్యం చెప్పంది. అంతేకాదట అత్యధిక మెడల్స్ సాధించడంతో పాటు అందులోనూ అత్యధికంగా ఎక్కువ స్వర్ణ పథకాలనే సాధిస్తుందట. గతంలో 23 పథాకాలను సాధించిపెట్టిన అమెరికా స్మిమ్మర్ మైకెల్ ఫెల్ఫ్స్ ఈ సారి మరో ఐదు బంగారు పథాకాలను, ఒక క్యాంస పథకంతో తన పథకాల జాబితాను 28 తీసుకెళ్తాడని అంచనావేసింది.
మరో 99 రోజుల వ్యవధిలో క్రీడాకారుల అద్భుత ప్రతిభకు దర్ఫణం పట్టే రియో ఒలంపిక్స్ తెరలేగనుండడంతో ఏయే దేశాలు ఎన్నెన్ని పథకాలను సాధిస్తాయన్న అంశంలో అంచనాలు వేసింది గ్రేస్ నోట్. ఈ పర్యాయం కూడా అత్యధికంగా 102 మెడల్స్ తో అమెరికా ముందంజలో నిలుస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. అందులో 42 స్వర్ణం, 29 రజతం, 31 కాంస్య పథకాలు వుంటాయని కూడా అంచనా వేసింది. ఇక అమెరికా తరువాతి రెండో స్థానంలో చైనా నిలుస్తుందని కూడా గ్రేస్ నోట్ అంచనావేసింది. చైనా 31 స్వర్ణం, 26 రజతం, 22 కాంస్య పథకాలతో రెండోస్థానంలో కొనసాగుతుందని జోస్యం చెప్పింది.
ఇక ఆ తరువాతి స్థానంలో రష్యా నిలుస్తుందని, రష్యా 66 పథాకాలు అందులో 22 స్వర్ణం, 22 రజితం, 22 క్యాంస పథకాలుంటాయని అంచనా వేసిన గ్రేస్ నోట్.. ప్రతిష్టాత్మక రియో ఒలంపిక్స్ కు ఈ పర్యాయం వేదిక కల్పిస్తున్న బ్రెజిల్ కూడా 25 పతకాలను సాధించి రికార్డు నెలకొల్పుతుందని జోస్యం చెప్పింది అందులో 9 స్వర్ణం, 8 రజితం, 8 కాంస్య పథకాలుంటాయని కూడా పేర్కోంది. ఈ సారి కూడా పథకాల పంట పండించుకునేందుకు అమెరికా మూడు ప్రథానమైన విభాగాలలోనే దృష్టిసారించిందని, అవి స్విమ్మింగ్, అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ విభాగాలని కూడా తేల్చిచెప్పింది.
తఇక భారత్ విషాయానికి వస్తే.. గ్రేస్ నోట్ అంచానాలు నిజమైన పక్షంలో భారత్ గత పర్యాయం లండన్ లో జరిగిన ఒలంపిక్స్ కన్న తక్కువ పతకాలనే సాధిస్తుందట. లండన్ లో రెండు రజతం, 4 కాంస్య పథకాలను సాధించిన భారత్ ఈ సారి వాటిలో ఒక పతకాన్ని జార విడుచుకుంటుందని గ్రేస్ నోట్ జొస్యం చెప్పింది, అయితే ఈ సారి భారత్ ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించే అవకాశాలు వున్నాయని కూడా అంచనా వేసింది. లెన్నిస్ మిక్సిడ్ డబుల్స్ విభాగంలో స్వర్ణం సాధించే అవకాశాలు వున్నాయని అంచనా వేసిన గ్రేస్ నోట్.. మహిళల అర్చరీ, బాక్సర్ శి తప్ప, షూటర్ జితు రాయ్, షూటింగ్ మహిళలు డబుల్స్ విభాగాల్లో భారత్ పథాలను సాధించవచ్చని పేర్కోంది.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more